Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!
భారీగాపెరిగిన వంటనూనెల ధరలు...ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంటనూనె రేట్లు తగ్గుతుండటంతో దేశంలో కూడా ఆయిల్ కంపెనీలు తమ వంటనూనె బ్రాండ్ల రేట్లను తగ్గించాలని కేంద్రం ఆదేశించింది.
- By hashtagu Published Date - 10:00 AM, Thu - 7 July 22
భారీగాపెరిగిన వంటనూనెల ధరలు…ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంటనూనె రేట్లు తగ్గుతుండటంతో దేశంలో కూడా ఆయిల్ కంపెనీలు తమ వంటనూనె బ్రాండ్ల రేట్లను తగ్గించాలని కేంద్రం ఆదేశించింది. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల MRP లీటర్ పై రూ. 10 చొప్పున తగ్గించాలని… ఈ తగ్గింపు కూడా వచ్చే వారంలోపే జరగాలని పేర్కొంది. దీంతోపాటు ఒక బ్రాండ్ వంటనూనె రేటు దేశమంతటా ఒకేలా ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు నగరాల్లో ఒకే బ్రాండ్ వంటనూనె లీటర్ ధరలో మూడు నుంచి ఐదు రూపాయల తేడా ఉంది. ఇక నుంచి ఒకే ధర ఉండేలా చూడాలని కంపెనీలకు కేంద్రం సూచించింది.
దేశంలో వంటనూనె అవసరాల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా వంటనూనె రేట్లు పెరిగాయి. దీంతో మన దేశంలో కూడా కంపెనీలు ధరలు భారీగా పెంచాయి. కానీ గత కొన్ని నెలల నుంచి వంటనూనెల ధరలు దిగివస్తున్నాయి. దీంతో గత నెలలో వంటనూనె ధరను ఆయా కంపెనీలు లీటర్ పై 10 నుంచి 15 రూపాయలు తగ్గించాయి. అంతకుముందు కూడా ఒకసారి రేట్లను సవరించాయి కంపెనీలు.
వంటనూనె రేట్లు తగ్గడంపై చర్చించేందుకు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే వంటనూనె తయారీదారుల అసోసియేషన్లతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, ఎంఆర్ పీ తగ్గింపుపై చర్చలు జరిపారు. అంతర్జాతీయంగా తగ్గిన ధరలను వినియోగదారులకూ బదలాయించాలని సూచించారు.
Related News
PM Modi: మోడీ వికసిత్ భారత్ నినాదం.. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యం
PM Modi: అభివృద్ధి, సంక్షేమ నినాదంతో మోదీ సర్కార్ మూడోసారి అధికారం అందుకోవాలని పట్టుదలగా ఉంది. గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వాటి వివరాలను ప్రజల ముందు ఉంచుతోంది. రోడ్లు, రైల్వేలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఎల్పీజీ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ , నమామి గంగే, కొవిడ్ సమయంలో అందించిన టీకాల సమాచారాన్ని ప్రజలకు వివరిస్తోంది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేం