HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Can We Drink Water After Eating Fruits

Fruits: ఈ పండ్లు తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?

మామూలుగా వైద్యులు ఆరోగ్యంగా ఉండాలి అంటే తరచూ తాజా పండ్లను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యం

  • By Anshu Published Date - 10:00 AM, Wed - 31 January 24
  • daily-hunt
Mixcollage 31 Jan 2024 09 31 Am 5474
Mixcollage 31 Jan 2024 09 31 Am 5474

మామూలుగా వైద్యులు ఆరోగ్యంగా ఉండాలి అంటే తరచూ తాజా పండ్లను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా పండ్లను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా నీటి శాతం ఎక్కువ కలిగిన పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటివల్ల శరీరం తొందరగా డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన ఫైబర్ విటమిన్లు కూడా అందుతాయి. అయితే పండ్లు తినడం మంచిదే కానీ పండ్లు తిన్న తర్వాత పొరపాటున కూడా నీటిని అస్సలు తాగకూడదు అనుకున్నారు వైద్యులు. మరి పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పండ్లలో హైడ్రేటింగ్ శక్తి విపరీతంగా ఉంటుంది. మీకు చాలా దాహం వేసినప్పుడు పండ్లు తిన్నా కూడా దాహం తీరుతుంది. మళ్లీ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు పుచ్చకాయను తిన్నారనుకోండి. మీకు అస్సలు దాహమే వేయదు.. పండ్లు తిన్నాక దాహం తీరాక కూడా మళ్లీ నీళ్లు తాగితే శరీరంలో లేనిపోని సమస్యలు వస్తాయి. దాంతో ఏరి కోరి సమస్యలను తెచ్చుకున్నట్టే అవుతుంది. ఒకవేళ పండ్లు తిన్నాక కూడా విపరీతంగా దాహం వేస్తే, కనీసం 30 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దాహం తీర్చుకోవాలి. దాహం వేయకపోత కనీసం ఓ గంట సేపు ఆగి నీళ్లు తాగాలి. పండ్లు తినగానే అవి డైరెక్ట్ గా జీర్ణాశయంలోకి వెళ్తాయి. అక్కడ జీర్ణ ప్రక్రియ కోసం తిన్న పండ్లను అరిగించడం కోసం జీర్ణ వ్యవస్థ కొన్ని ఆమ్లాలను విడుదల చేస్తుంది.

ఆ ఆమ్లాలు వెంటనే తిన్న పండ్లను జీర్ణం చేస్తాయి. ఒకవేళ మీరు పండ్లు తినగానే నీళ్లు తాగితే ఆ నీళ్లు విడుదలైన జీర్ణ ఎంజైమ్ లను పలుచన చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. తిన్న పండ్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దాన్ని జీర్ణం చేయడానికి జీర్ణ వ్యవస్థ ఎక్కువ సేపు కష్టపడాల్సి వస్తుంది. దాని వల్ల గ్యాస్ రావడం, కడుపులో మంట రావడం ఇతర సమస్యలు వస్తాయి. అలాగే తిన్న పండ్లు కూడా తొందరగా జీర్ణం కావు. పండ్లు తినగానే నీటిని తాగితే అతిసారం వస్తుంది. పండ్లలో ఎక్కువ నీరు ఉండటం, నీరు తాగగానే మరోసారి శరీరంలో నీటి కంటెంట్ ఎక్కువ అవుతుంది. దాని వల్ల పేగుల కదలికలు సులభతరం అయి అతిసారానికి దారి తీస్తుంది. అలాగే శరీరంలోని పీహెచ్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. పీహెచ్ స్థాయి ఆమ్లతను సూచిస్తుంది. పండ్లు తినగానే నీరు తాగితే పీహెచ్ స్థాయిలు కూడా పలుచన అవుతాయి. దాని వల్ల కూడా జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వస్తుంది. అందుకే.. పండ్లు తినగానే అస్సలు నీళ్లు తాగకూడదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drinkng water
  • eating fruits
  • fruits
  • health problems

Related News

Diabetics

‎Diabetics: డయాబెటిస్ పేషెంట్లు బంగాళదుంపలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎Diabetics: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు బంగాళదుంపలు తినవచ్చా తినకూడదా,ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Latest News

    • IND vs PAK: మహిళల ప్రపంచ కప్‌లోనూ భారత్ వర్సెస్ పాకిస్తాన్.. హ్యాండ్‌షేక్ ఉండదా?

    • Using Mobile: యువతలో వేగంగా పెరుగుతున్న మెడ నొప్పి సమస్యకు కారణాలివే!

    • Kuldeep Yadav: టెస్ట్ క్రికెట్‌లో కుల్‌దీప్ యాదవ్ అద్భుత పునరాగమనం!

    • Police Power War: కడప వన్ టౌన్‌లో పోలీస్ పవర్ వార్.. సీఐ వర్సెస్ ఎస్పీ!

    • IT Industry Performamce: షాకింగ్ రిపోర్ట్‌.. మందగిస్తున్న భారత ఐటీ రంగం!

    Trending News

      • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

      • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

      • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

      • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

      • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd