ప్రచారం : ‘‘పవిత్ర రంజాన్ మాసం వేళ పుచ్చకాయల్లో రసాయనాలను కలిపి అమ్ముతున్న హిందూ యువకుడు’’ అంటూ ఒక వీడియో వైరల్ అయింది.
వాస్తవం : మరో విషయానికి సంబంధించిన వీడియోను ఎడిట్ చేసి, ఈ వైరల్ వీడియోను తయారు చేశారు. ఈ వీడియో 10 నెలలు పాతది. దీనికి ఏ నిజమైన సంఘటనతోనూ సంబంధం లేదు.
Also Read :Prakash Raj Vs PM Modi: మణిపూర్కూ ఓసారి వెళ్లండి.. మోడీ గిర్ టూర్పై ప్రకాశ్రాజ్ ట్వీట్
పుచ్చకాయలోని ఎరుపు రంగును కృత్రిమంగా పెంచడానికి, దానిలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేస్తున్నారనే వాదనతో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు రంజాన్ మాసంతో లింక్ పెడుతున్నారనే మతపరమైన వాదనతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వైరల్ అయిన ఈ వీడియో ఫేక్ అని, అది ఎడిట్ చేసిన వీడియో అని బూమ్ గుర్తించింది.