HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Worship Lord Shiva Like This For Wealth Money

Lord Shiva: ఐశ్వర్యం మీ సొంతం అవ్వాలంటే శివుడికి ఈ విధంగా అన్నం సమర్పించాల్సిందే!

పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధించాలంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాలట..

  • By Anshu Published Date - 01:45 PM, Thu - 19 September 24
  • daily-hunt
Lord Shiva
Lord Shiva

మామూలుగా సోమవారం రోజు పరమేశ్వరున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే శివుడికి ఇష్టమైన పువ్వులను నైవేద్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి అన్న, అష్టైశ్వర్యాలు సిరిసంపదలు కలగాలి అంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు. అందుకోసం ముఖ్యంగా అన్నాన్ని వివిధ రూపాలుగా సమర్పించడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

తెల్ల అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నదిలో వదిలితే, ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. అలాగే చర్మ వ్యాధులు ఉన్నవారు తెల్ల అన్నంలో తేనె కలిపి నైవేద్యంగా పెట్టడం వల్ల చర్మానికి సంబంధించిన వ్యాధులు సమస్యలు నయమవుతాయని చెబుతున్నారు. ఇక రోగ నివారణ కావాలి అనుకున్న వారు తెల్ల అన్నం, తేనె, పంచదార, కొబ్బరి కలిపి కులదేవతకు నైవేద్యం పెట్టి అన్నదానం చేస్తే, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే తెల్ల అన్నం, శనగపప్పుతో పాయసం చేసి ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి దానం చేస్తే, ఇంట్లో శాంతి, ప్రేమ, అభిమానం పెరుగుతాయట.

పితృదేవతల పాపాలు తొలగిపోవాలి అంటే తెల్ల అన్నం నల్ల నువ్వులు కలిపి శనీశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు వేస్తే పితృదేవతల శాపాలు కూడా తొలగిపోతాయట. అన్నం దేవునికి నైవేద్యం పెట్టి, పశువులకు ఆహారంగా ఇచ్చి, అవివాహితులకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే, ధనం వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. దిష్టి ఉన్నవారు తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దారులు కలిసే చోట పెట్టడం వల్ల దిష్టి తొలగిపోతుందట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lord Shiva
  • wealth
  • worship
  • worship lord lord

Related News

    Latest News

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd