Chardham Yatra: చార్ధామ్ యాత్ర.. రెండు పుణ్యక్షేత్రాలు మూసివేత!
చార్ధామ్లలోని రెండు ప్రధాన మతపరమైన పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి. ఈ రెండు చోట్లా ఈసారి దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
- By Gopichand Published Date - 09:28 PM, Wed - 22 October 25

Chardham Yatra: దీపాల పండుగ దీపావళితో పాటు చార్ధామ్ యాత్ర (Chardham Yatra)లో భాగమైన రెండు పుణ్యక్షేత్రాల తలుపులు మూసివేయబడనున్నాయి. ఈ రెండు ధామాలలో యమునోత్రి, గంగోత్రి ఉన్నాయి. ఈ రెండు ధామాలను మూసివేయడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మోక్షాన్ని ప్రసాదించే గంగా, యమునా మాతకు ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఈ రెండు ధామాల తలుపులు శీతాకాలం కోసం మూసివేయబడతాయి. దీనికి గోవర్ధన పూజ రోజున శ్రీకారం చుట్టనున్నారు. ఆ మరుసటి రోజు అంటే భాయ్ దూజ్ నాడు యమునోత్రి తలుపులు మూసివేసి యాత్రకు విరామం పడనుంది.
గంగోత్రి- యమునోత్రి తలుపులు ఈ రోజులలో మూతపడతాయి
సమాచారం ప్రకారం.. చార్ధామ్లలోని అత్యంత ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటైన గంగోత్రి తలుపులు నేడు అంటే అక్టోబర్ 22, 2025 (గోవర్ధన పూజ) రోజున మూసివేయబడతాయి. ఈ రోజు ఉదయం 11 గంటల 36 నిమిషాలకు గంగోత్రి తలుపులు మూసివేయబడతాయి. ఇక మరుసటి రోజు అంటే అక్టోబర్ 23, 2025 (గురువారం, భాయ్ దూజ్) నాడు యమునోత్రి తలుపులు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మూతపడతాయి.
Also Read: Cholesterol: కొలెస్ట్రాల్ను తగ్గించే ఆహార పదార్థాలివే!
శీతాకాలంలో గంగా, యమునా దర్శనాలు లభిస్తాయి
గంగోత్రి- యమునోత్రి తలుపులు మూసివేసిన తర్వాత శీతాకాలంలో భక్తులు యమునా మాత ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలో, గంగా మాత ఉత్సవ విగ్రహాన్ని ముఖ్బా గ్రామంలో దర్శించుకోవచ్చు. గంగా మాత- యమునా మాతల ప్రత్యేక పూజల కోసం ఈ రెండు ధామాలను పూలమాలలతో అలంకరించారు. ఇక్కడ భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇక్కడ దీపావళి చాలా వైభవంగా జరిగింది
చార్ధామ్లలోని రెండు ప్రధాన మతపరమైన పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి. ఈ రెండు చోట్లా ఈసారి దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీటిని చక్కగా అలంకరించారు. భక్తులు, పూజారులు గంగా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమయంలో ఆ ప్రాంతమంతా కాంతులీనింది.