TTD: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
- By Balu J Published Date - 05:13 PM, Thu - 12 October 23
TTD: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబర్ 14న ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేశాయి.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న 72,230 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,388. బుధవారం స్వామివారి హుండీ మూలధనం 3.74 కోట్లు.
Also Read: Nirmala Sitharaman: మొరాకో పర్యటనలో నిర్మలా సీతారామన్, ఆర్థిక విషయాలపై చర్చ
Related News
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఎందుకు జరుపుతారో తెలుసా
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే వసంత రుతువులో మలయప్ప స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 ను�