TTD : ఏప్రిల్లో తిరుమలకు వెళ్లానుకుంటున్నారా..? అయితే మీరు ఇది చూడాల్సిందే..
- By Sudheer Published Date - 03:53 PM, Tue - 23 January 24
ఏప్రిల్ (April ) నెలలో తిరుమల (Tirumala)కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి శుభవార్త తెలిపింది టీటీడీ (TTD). ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేసింది టీటీడీ. అలాగే శ్రీవారి దర్శన టిక్కెట్లు, వసతి గదులు కోటా, సీనియర్ సిటిజన్లు/వికలాంగుల కోటా టికెట్లను విడుదల చేసింది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను జనవరి 24న అంటే రేపు ( జనవరి 24) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే గురువారం రామకృష్ణ తీర్ద ముక్కోటి సందర్బంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనుంది టీటీడి. జనవరి 25న పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ ఉంటుంది. దీంతో ఆరోజజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
Read Also : Ayodhya Ram New Name : అయోధ్య రామయ్యకు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?
Related News
TTD: 2024 మే 16న తిరుపతిలో వార్షిక ఉత్సవాలు ప్రారంభం
TTD: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 గంటల నుంచి 8.40 గంటల వరకు పవిత్ర మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాల మధ్య గరుడ ధ్వజపథం ఎగురవేయడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పూర్వం శ్రీ గోవిందరాజస్వామి, గరుడ ధ్వజపథం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపన �