Koti Deepotsavam: ఘనంగా కోటి దీపోత్సవం, శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం
- By Balu J Published Date - 04:56 PM, Sat - 18 November 23

Koti Deepotsavam: మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలుస్తుంది. అందుకే భారతీయ మహిళలు విధిగా దీపారాధణ చేస్తుంటారు. అలాంటివాళ్ల కోసమే హైదరాబాద్ లో కోటిదీపోత్సవం ప్రతి ఏడు ఘనంగా జరుగుతుంటుంది. ఈ నెల 14 మంగళవారంతో మొదలై, నవంబర్ 27 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్తీక మాసాన ఆ శివకేశవ సాక్షిగా సాగే కోటిదీపార్చన మహోత్సవంలో పాల్గొని.. అపూర్వ సాంస్కృతిక కదంబాలు.. సప్తహారతుల కాంతులు.. కోటి దీపాల వెలుగులో భక్తులు తన్మయత్వం పొందుతున్నారు.
నవంబర్ 27వరకు జరగనున్న ఈ దీపోత్సవంలో వేదికనెక్కే వేద పండితులు, అతిథులుగా హాజరయ్యే అతిరథమహారథులు, ప్రతిరోజూ వేలు, లక్షలుగా భక్త జనం పాల్గొంటున్నారు. లక్ష దీపాల అంకురార్పణతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం.. కోటిదీపోత్సవంగా మారింది.. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది నిరాటంకంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
Related News

Telangana TDP : ఆ బీఆర్ఎస్ అభ్యర్థికి తెలంగాణ టీడీపీ మద్దతు
Telangana TDP : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు అన్ని రకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకో రోజు మాత్రమే ఉంది. అంటే.. 28న ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. దీంతో ప్రధాన పార్టీలు ఈ ఒక్క రోజును తమ ప్రచారానికి బాగా వాడుకోవాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈనేపథ్యంతో శేరిల