Tirumala: శాస్త్రోక్తంగా పత్ర పుష్పయాగం
తిరుమల తిరుపతి అనగానే వేంకటేశ్వరస్వామి మాత్రమే కాదు.. అక్కడ జరిగే నిత్య పూజలూ భక్తులను విశేషంగా అలరిస్తుంటాయి.
- By Balu J Published Date - 07:53 PM, Mon - 16 May 22
తిరుమల తిరుపతి అనగానే వేంకటేశ్వరస్వామి మాత్రమే కాదు.. అక్కడ జరిగే నిత్య పూజలూ భక్తులను విశేషంగా అలరిస్తుంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేక పూజ జరుగుతూనే ఉంటుంది. అందుకే శ్రీవారి భక్తులు ఆ పూజ విధానాలను చూస్తూ పరవశించిపోతుంటారు. సోమవారం తిరుపతి కపిలేశ్వరాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా పత్ర పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం కపిలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం పుష్ప పత్రయాగ మహోత్సవం చేశారు. చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరం పూలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులను ఇందులో వినియోగించారు.
Related News
Tirupati: వైభవంగా కోదండరాముని రథోత్సవం.. భక్తుల నీరాజనాలు
Tirupati: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించా�