HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Man Goes With Golden Footware From Hyderabad To Ayodhya Ram Mandir Will Give To Yogi Adityanath

Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు ప్రయాణం.. వాటి ధర తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అందరి చూపు కూడా అయోధ్

  • By Anshu Published Date - 07:00 PM, Thu - 11 January 24
  • daily-hunt
Mixcollage 11 Jan 2024 06 34 Pm 2234
Mixcollage 11 Jan 2024 06 34 Pm 2234

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అందరి చూపు కూడా అయోధ్య రామ మందిరం పైనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈనెల 22వ తేదీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా వందల సంవత్సరాల నాటి కల నెరవేరుతున్నందుకు శ్రీరాముని భక్తులు అలాగే హిందువులు ఆ మంచి గడియల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక రాముడి పై ఉన్న భక్తితో భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు స్వామివారికి విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. కొందరు స్వామి వారికి తోచిన విధంగా డబ్బు సహాయం చేస్తుండగా మరి కొందరు వస్తువుల రూపంలో సహాయం చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కూడా అయోధ్య రామ మందిరం కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తి చల్లా శ్రీనివాస్ శాస్త్రి, దేవుడికి బంగారు పూత పూసిన జత చెప్పులను సమర్పించడానికి అయోధ్యకు కాలినడకలన వెళ్లేందుకు సంకల్పించారు. దాదాపు 7,200 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. ఆయన అయోధ్య-రామేశ్వరం మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో శ్రీరాముడు తన వనవాసం సమయంలో అనుసరించిన మార్గాన్ని ఎంచుకున్నారు.

అయితే శ్రీరాముడు అయోధ్య నుంచి రామేశ్వరం చేరుకుంటే, శాస్త్రి మాత్రం శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగాన్ని దర్శించి జులై 20న తన నడకను ప్రారంభించానని, రివర్స్‌ ఆర్డర్‌లో యాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. జనవరి 15న అయోధ్య చేరుకోవడమే తన లక్ష్యం అని తెలిపారు. జనవరి 16న ఈ చరణ్ పాదుక ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి అందజేస్తానని అన్నారు. జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు అయోధ్యను సందర్శించడం చాలా ఉత్సాహంగా ఉందని అన్నారు. రాముడి చెప్పులకు ప్రత్యేక విలువ ఉందన్నారు. రామాయణం ప్రకారం, శ్రీరాముని సోదరుడు భరతుడు రాజ్యాన్ని పాలించేందుకు గౌరవ సూచకంగా సింహాసనంపై తన అన్న శ్రీరాముని చెప్పులను ఉంచి అయోధ్యను పాలించినట్లు పురాణ ఇతిహాసాన్ని వివరించారు.

 

#WATCH | Telangana: A 64-year-old man, Challa Srinivas Sastry from Hyderabad embarked on a 7,200-kilometre padayatra to Ayodhya carrying Khadaun ‘charan paduka’ with him ahead of the ‘Pran Pratishtha’ ceremony of the Ram Temple. (09.01) pic.twitter.com/J8hQg6hBcS

— ANI (@ANI) January 10, 2024

శ్రీరాముడికి ఇవ్వడానికి నేను ప్రస్తుతం పంచ ధాతు అంటే ఐదు లోహాలతో తయారు చేసిన బంగారు పూతతో కూడిన పాదుకలు అనగా పాదరక్షలు తీసుకువెళుతున్నాను అని చెప్పుకొచ్చారు. తమిళనాడు నుంచి రోజుకు 30 నుండి 50 కి.మీ ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. బంగారు పూత పూసిన చెప్పుల జత విలువ దాదాపు రూ. 65 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా అందులో కొంత భాగాన్ని భక్తులు విరాళంగా కూడా ఇచ్చారని తెలిపారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శాస్త్రి భవిష్యత్తులో అయోధ్యలో శాశ్వతంగా స్థిరపడాలని కోరుకుంటున్నాట్లు తన అంతరంగాన్ని వివరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayodhya
  • Ayodhya Ram Mandir
  • hyderabad
  • ram mandir
  • yogi adityanath

Related News

Police Seized Drugs

Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Drugs : ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో ఈ ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. ఈ డ్రగ్స్ తయారీ కేంద్రం నుండి సుమారు రూ. 12వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ మరియు 32వేల లీటర్ల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు

  • Balapur Ganesh

    Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • Balapur Ganesh Laddu sets record price..how many lakhs this time..?

    Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • Ganesh Nimajjanam Tank Bund

    Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd