Last Shravan Somvar : శ్రావణమాసం చివరి సోమవారం నాడు శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయండి..!!
శ్రావణమాసం హిందువులకు ఎంతో ముఖ్యమైంది. శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
- By hashtagu Published Date - 06:00 AM, Sun - 21 August 22
శ్రావణమాసం హిందువులకు ఎంతో ముఖ్యమైంది. శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో చేసే పూజలు, పరిహారాలు జీవితంలోని అన్ని బాధలను తొలగిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. 22వ తారీఖున వచ్చే సోమవారం ఈ శ్రావణమాసంలో చివరిది. శ్రావణ మాసం ముగిసి…భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణమాసం చివరి సోమవారం నాడు శివుడిని పూచించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
బిల్వపత్రం:
శివుడికి బిల్వ పత్రం పూజిస్తే…మీరు కోరిక కోరికలన్నీ నెరవేరుతాయి. శివునికి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించడంవల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.
శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయండి:
శ్రావణమాసం చివరి సోమవారం రోజు…తెల్లవారుజామునే నిద్రలేచి..ప్రదోష సమయంలో గంగాజలం తీసుకుని ఓం నమ:శివాయ అని జపిస్తూ ఆలయానికి వెళ్లండి. శివుడికి గంగాజలం సమర్పించి పూజించండి. స్త్రీలైతే సాష్టాంగ నమస్కారం చేయండి. తర్వాత 108సార్లు శివ మంత్రాన్ని జపించండి.
సంపద శ్రేయస్సు కోసం:
చివరి సోమవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు శివాలయంలోనే గడపండి. అక్కడ నెయ్యి దీపం వెలిగించండి. చాలా సేపు వెలిగేలా చూడండి. తర్వాత రోజున చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేస్తే ఈ శివుడి అనుగ్రహం తప్పక మీపై ఉంటుంది.
సమస్యల నుంచి బయటపడాలంటే:
ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలతోకానీ బాధపడుతుంటే…మీకు దగ్గరలో ఉన్న పండితుడిని కానీ, జ్యోతిష్యుడిని కానీ సంప్రదించి శివుడికి నల్లనువ్వులను గంగాజలంలో కలిపి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి గట్టెక్కుతారు.
రుణ విముక్తి కోసం:
శివునికి పగలని అక్షింతను సమర్పించి…రుణవిముక్తి పొందమని శివుడిని ప్రార్థించండి. తర్వాత 108సార్లు శివమంత్రాన్ని జపించండి.
నైవేద్యం:
శివుడికి భక్తితో పూజలు నిర్వహించి నైవేద్యం పెడితే ఎంతో సంతోషిస్తాడని పండితులు చెబుతుంటారు. బియ్యంతో వండిన నైవేద్యాన్ని శివుడికి సమర్పించినట్లయితే ప్రసన్నుడై వరం ఇస్తాడు.
పండ్లు:
శ్రావణమాసం చివరి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పువ్వులు పండ్లు సమర్పించాలి. దాతురా, రేగు, నారింజ వంటి పండ్లను శివునికి సమర్పించి ప్రసన్నం చేసుకోవచ్చు.
Related News
Benefits Of MPs: దేశంలో ఎంపీలకు విలాసవంతమైన సౌకర్యాలు, అలవెన్సులు
ఎంపీగా గెలిస్తే ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎంపీలు నెలవారీ జీతం రూ. 1 లక్ష, అలవెన్సులు సహా. వారి పదవీకాలం తర్వాత పెన్షన్ రూ. 50,000.