TTD: కోట్లు కురిపిస్తోన్న శ్రీవారి హుండీ ఆదాయం
- By Balu J Published Date - 05:12 PM, Tue - 2 January 24
TTD: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం లా ఉంటుంది. దేశ నలుములాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తుల మొక్కుల చెల్లింపులతో శ్రీవారి హుండీ రోజురోజుకూ పెరుగుతుంటుంది. భక్తులు సమర్పించిన కానుకల కారణంగా తితిదే ఆదాయం రూ.1403.74 కోట్లుగా సమకూరింది. గత యేడాది ఒక్క జనవరి నెలలోనే 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ నెలలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది.
అలాగే, ఫిబ్రవరి నెలలో హుండీ ద్వారా రూ.114.29 కోట్ల ఆదాయం రాగా, 18.42 లక్షల మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మార్చి నెలలో 20.57 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.120.29 కోట్లుగా ఉంది. ఏప్రిల్ నెలలో 20.95 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.114.12 కోట్ల ఆదాయం సమకూరింది. మే నెలలో 23.38 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.109.99 కోట్ల ఆదాయం వచ్చింది.
జూన్ నెలలో 23 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.116.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. జూలై నెలలో 129.08 కోట్లు, ఆగస్టు నెలలో రూ.120.05 కోట్లు, సెప్టెంబరు నెలలో రూ.111.65 కోట్లు, అక్టోబరు నెలలో రూ.108.65 కోట్లు, నవంబరు నెలలో రూ.108.46 కోట్లు, డిసెంబరు నెలలో రూ.116.07 కోట్ల మేరకు హుండీ ఆదాయం వచ్చినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి వేడుకల సందర్భంగా హుండీ ఆదాయం బాగానే పెరిగింది.
Related News
Tirumala: కన్నుల పండువగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
Tirumala: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొదటిరోజు వైశిష్ట్యం : శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శుక్రవారంనాడు శ్రీమలయప్ప స్వ�