Ram Temple Priest: అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు ఇతనే..!
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య విద్యార్థి మోహిత్ పాండే, అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకులలో ఒకరిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాండే, భారతదేశం అంతటా ప్రధానార్చకుడి పదవి
- By Praveen Aluthuru Published Date - 08:11 AM, Mon - 22 January 24
Ram Temple Priest: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య విద్యార్థి మోహిత్ పాండే, అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకులలో ఒకరిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాండే, భారతదేశం అంతటా ప్రధానార్చకుడి పదవి కోసం సుమారు 3,000 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అయితే దరఖాస్తుదారుడి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే ఉండాలని షరతు విధించారు. అలాగే గురుకుల విద్యను అభ్యసించి ఉండాలని, శ్రీరాముడి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలు పెట్టారు. 3 వేల అభ్యర్థులను వడబోసి అందులో రెండు వందల మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా.. అందులో ఉత్తరప్రదేశ్లోని ఘజియా బాద్కు చెందిన 22ఏళ్ల మోహిత్ పాండే కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు.ప్రస్తుతం ఆలయ ప్రధానార్చకుడిగా సత్యేంద్ర దాస్ కొనసాగుతుండగా, శిక్షణ అనంతరం మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధానార్చకుడిగా బాధ్యతలను స్వీకరించను న్నాడు. మార్చిలో ప్రధాన అర్చక భాద్యతలు చేపట్లనున్నట్లు సమాచారం..
మోహిత్ పాండే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్ పూర్వ విద్యార్థి. అతని విద్యా ప్రయాణం ఏడు సంవత్సరాల పాటు, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు, పురాతన శ్రీ దూధేశ్వరనాథ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న సంస్థలో కొనసాగింది. ఇది ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయం. ఈ దేవాలయానికి ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది భక్తులు సందర్శిస్తారు.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం దూధేశ్వర్ వేద విద్యాపీఠం అధిపతి పీఠాధీశ్వర్ మహంత్ నారాయణగిరి మాట్లాడుతూ.. గత 23 ఏళ్లుగా వేద విద్యాపీఠంలో వేలాది మంది విద్యార్థులు వేదాలు, ఆచార వ్యవహారాలను అభ్యసించారని, ప్రస్తుతం 70 మంది విద్యార్థులు అర్చకులు, ఆచార్యులుగా శిక్షణ పొందుతున్నారు. వివిధ దేవాలయాలలో లార్డ్ దూధేశ్వరనాథ్ ఆశీర్వాదం ద్వారా అయోధ్యలో శ్రీరాముడికి సేవ చేయడానికి పాండే ఎంపిక అయ్యాడని సంతోషం వ్యక్తం చేశాడు.
మోహిత్ పాండే దూధేశ్వర్ వేద విద్యాపీఠ్లో విద్యాభ్యాసం తర్వాత తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో తన చదువును కొనసాగించాడు, 2020-21లో BA (శాస్త్రి) కోర్సులో చేరాడు. ప్రథమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఎస్వీవీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదాశివ మూర్తి పాండే ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పాండే అంకితభావం, మృదు స్వభావాన్ని, చదువు పట్ల నిబద్ధతను కొనియాడారు. యూనివర్శిటీకి చెందిన పలువురు విద్యార్థులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అర్చకులుగా, ఆచార్యులుగా పనిచేస్తున్నారని వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు.
Also Read: Convicts Surrendered : 11 మంది సరెండర్.. లొంగిపోయిన బిల్కిస్ బానో కేసు దోషులు
Related News
PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ
PM Modi : కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.