HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do You Know Where The 14 Foot Atmalingam Manikyamba Shakti Peetham Is Located In Andhra Pradesh

14 అడుగుల ఆత్మలింగం, మాణిక్యాంబ శక్తిపీఠం ఆంధ్రాలో ఎక్కడ ఉందో తెలుసా?

  • By Vamsi Chowdary Korata Published Date - 12:29 PM, Wed - 24 September 25
  • daily-hunt
Draksharamam
Draksharamam

భారతదేశంలోని అత్యంత ప్రాచీన, మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకతలు.
హిందువుల ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం కార్తీక మాసం అని అంటారు. ప్రతి ఏటా నవంబర్ నెలలో భక్తులు కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్తీక మాస పూజలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ, ప్రాచీన శివలింగ క్షేత్రాలు భక్తుల తాకిడితో పోటెత్తుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించి పంచారామ క్షేత్రాలు (ఐదు దేవాలయాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి భీమేశ్వర స్వామి వారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల్లోనూ ఈ ప్రదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. అసలు ద్రాక్షారామంలో పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది? అంత ఎత్తు ఎలా ఎదిగింది? ఇక్కడికి ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం… తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందుతాడు. తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడగగా… ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు. బాలకులు తనను ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు.

పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు. ఆ వర గర్వంతో దేవతలను, ఋషులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. తారకాసుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి రక్షించమని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు… తారకాసురున్ని వధించడం ఎవరి వల్లా కాదని, శివాంశతో జన్మించిన బాలకుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు. దీంతో దేవతలు పరమేశ్వరున్ని శరణు వేడగా, పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమార స్వామికి జన్మనిస్తాడు.

రుద్ర గణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు. ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురున్ని వధించడం సాధ్యపడుతుందని తెలుసుకుని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు. దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరి పడి తారకాసురుడు మరణిస్తాడు. భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి, ఇతర దేవతలు ప్రతిష్టించారు. అవే ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు. చాళుక్య రాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా పిలుస్తారు.

మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం… సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివున్ని కోరుతుంది. భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు. శివున్ని ఎప్పుడూ ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే ఆయన్ని అవమానిస్తాడు.

భర్తకు జరిగిన అవమానాన్ని సహించని సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది. దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రున్ని సృష్టించి దక్షుడి తల నరికిస్తాడు. సతీదేవి వియోగం నుంచి పరమేశ్వరున్ని బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేస్తాడు. ఆ శరీర అవయవాలే దేశంలో 18 చోట్ల శక్తి పీఠాలుగా అవతరించినట్లు చెబుతారు.

ఆ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. దక్ష ప్రజా పతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం. పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారని, కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశ పీఠంగా గుర్తింపు ఉంది.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #DakshinaKasi
  • #Draksharamam
  • #DraksharamamTemple
  • #PancharamaKshetram
  • #ShriBhimeswaraSwamyTemple
  • #SpatikaLinga
  • and location-based hashtags like #EastGodavari #AndhraPradesh

Related News

    Latest News

    • IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

    • Heavy Rain Alert: తెలంగాణకు వర్షాల హెచ్చరిక – 26, 27న అతిభారీ వర్షాలు

    • Asia Cup Super 4: నేడు బంగ్లాతో భార‌త్ మ్యాచ్‌.. గెలిస్తే ఫైన‌ల్‌కే!

    • CBN Legal Notice: సీఎం చంద్రబాబుకు లీగల్‌ నోటీసులు..ఎవరు పంపారో తెలుసా..?

    • OG Mania : ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న ‘OG’ సంబరాలు

    Trending News

      • Cycling vs Walking: వాకింగ్ vs సైక్లింగ్ – ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల అభిప్రాయం

      • GST Reforms: జీఎస్టీ 2.0.. మొద‌టిరోజు అమ్మ‌కాలు ఏ రేంజ్‌లో జ‌రిగాయంటే?

      • Cash: ఇంట్లో ఎంత న‌గ‌దు ఉంచుకుంటే మంచిది?

      • GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

      • Kantara Chapter 1 Trailer: కాంతారా చాప్ట‌ర్-1 ట్రైల‌ర్ విడుద‌ల‌.. అద‌ర‌గొట్టిన రిషబ్‌ శెట్టి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd