Dhanteras 2025: ధన త్రయోదశి రోజున చేయాల్సిన 3 రకాల పనులు.. పొరపాటున కూడా అస్సలు మర్చిపోకండి!
Dhanteras 2025: ధన త్రయోదశి రోజున మూడు రకాల పనులను కచ్చితంగా చేయాలని,వాటిని పొరపాటున కూడా మరిచిపోకూడదని అవి చేస్తే మీకు వచ్చే ఫలితాలను అస్సలు నమ్మలేరు అని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 06:31 AM, Wed - 15 October 25

Dhanteras 2025: ధన త్రయోదశి అనేది దీపావళి పండుగకు ముందు వచ్చే అత్యంత శుభప్రదమైన రోజు. ఈ ధన త్రయోదశి రోజున భక్తులు యమధర్మరాజులను పూజిస్తారు. అలాగే సంపద, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని, కుబేరుడిని కూడా పూజిస్తారు. ఆర్యోగం కోసం ధన్వంతరిని పూజిస్తారు. అంతే కాకుండా ఈ రోజున శుభకరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా శాశ్వత సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం వెండి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుందని నమ్మకం. అలాగే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురను కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం తొలగిపోతాయని నమ్మకం.
గోమతి చక్రం కూడా సానుకూల శక్తిని, శ్రేయస్సును ఆకర్షిస్తుంది కాబట్టి చాలా మంది ఈ గోమతి చక్రం కొనుగోలు చేస్తారట. వీటితోపాటుగా చేయాల్సిన 3 రకాల పనులు ఏంటి అన్న విషయానికి వస్తే.. ధన త్రయోదశి రోజున పాటించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది యమ దీపాన్ని వెలిగించడం. ధంతేరాస్ రోజు సాయంత్రం పూట ఇంటి బయట దక్షిణ దిశ వైపు ఒక మట్టి ప్రమిదలో నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలట. ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా యమ ధర్మరాజుని ప్రసన్నం చేసుకోవడానికి దీపం దానం కూడా చేస్తారు.
దీనివల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుందట. ఇంట్లోని వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ధన త్రయోదశి పండుగ రోజు ఇంట్లో దీపాలు వెలిగించి పూలతో అందంగా ఇంటిని చక్కగా అలంకరించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలట. ఇంటి గుమ్మాలు, కిటికీల వద్ద నెయ్యి దీపాలు వెలిగించాలట. ఇలా చేయడం వల్ల దీపపు కాంతి చీకటిని, ప్రతికూల శక్తులను తొలగిస్తాయని నమ్మకం. ప్రధానంగా ఇంట్లో ఆగ్నేయం సంపద మూల కాబట్టి ఈ మూలలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం అని చెబుతున్నారు. అలాగే ఈ రోజు పేదలకు, అవసమర్థులకు దానం చేయడం మంచిది అని చెబుతున్నారు. అదేవిధంగా ధన త్రయోదశి రోజు ఉదయాన్నే తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసి తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందట. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారికి తామర పూల మాల సమర్పించడం అత్యంత శుభప్రదం అని చెబుతున్నారు. అలాగే పసుపు బియ్యంతో కలిపి ముద్దగా చేసి ఇంటి ప్రధాన ద్వారంపై ఓం అని రాయడం వల్ల ఇంట్లో సంతోషం, సిరిసంపదలు, అదృష్టం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.