Saraswati Pushkaralu 2025 : రెండో రోజు భారీగా తరలివస్తున్న భక్తులు
Saraswati Pushkaralu 2025 : పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, హరితహార కార్యాచరణలు కూడా నిర్వహిస్తున్నాయి.
- Author : Sudheer
Date : 16-05-2025 - 8:51 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో సరస్వతి నదీ పుష్కరాలు (Saraswati Pushkaralu 2025) రెండో రోజుకు చేరాయి. కాళేశ్వరం ప్రాంతంలో పుష్కరాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజే లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా, రెండో రోజున ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు, భద్రత, క్లీన్వాటర్, బట్టలు మార్చుకునే గదులు తదితర సదుపాయాలను అందుబాటులో ఉంచారు.
Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్, పాక్ జట్లకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), పలువురు మంత్రులు కూడా తొలిరోజే పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం, బాసర, నిజామాబాద్, ఇతర పుష్కర ఘాట్ల వద్ద పోలీసు, రెవెన్యూ, హెల్త్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. TSRTC ప్రత్యేక బస్సులు నడుపుతూ భక్తులకు ఆర్టీసీ సౌకర్యాలు కల్పిస్తోంది.
ఈ సందర్భంగా పుష్కర స్నానానికి వచ్చిన భక్తులు నదీ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పాలకులు సూచించారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, హరితహార కార్యాచరణలు కూడా నిర్వహిస్తున్నాయి. పుష్కరాల 12 రోజుల పాటు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.