TTD: వైకుంఠ ఏకాదశికి తిరుమలకు పోటెత్తిన భక్తులు
- Author : Balu J
Date : 23-12-2023 - 3:41 IST
Published By : Hashtagu Telugu Desk
TTD: ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల రద్దీతో తిరుమలలో సందడి నెలకొంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరడంతో పుణ్యక్షేత్రం జనంతో నిండిపోయింది. “గోవిందా” అని నామస్మరణలతో మార్మోగింది. తెల్లవారుజామున 1:45 గంటలకు తలుపులు తెరుచుకోవడంతో భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో సామర్థ్యానికి మించి నిండిపోయారు. వేంకటేశ్వర స్వామి తేజస్సుతో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ఇదే కోలాహలం నెలకొంది.
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, సంప్రదాయ ఆచార వ్యవహారాలతో జరుపుకున్న ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి శ్రద్దలు తారాస్థాయికి చేరుకున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, భద్రాచలంలోని శ్రీ రామచంద్ర స్వామి ఆలయం, వెల్ములవాడలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంతో సహా ఇతర పూజ్యమైన ఆలయాలు కూడా వైకుంఠానికి ప్రతీకగా ఉండే పవిత్రమైన “ఉత్తర ద్వార దర్శనం” తో సందడి నెలకొంది.