Nalgonda: చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు షురూ.. కన్నుల పండుగగా శివ పార్వతుల పూజలు
- By Balu J Published Date - 05:44 PM, Sun - 18 February 24
Nalgonda: నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. లక్షలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. శనివారం తెల్లవారుజామున లక్షలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.ఈ ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్లీ ఎప్పుడూ రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు నిర్మిస్తామని, భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చెర్వుగట్టులో పూజల కోసం నల్లగొండ జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న చెరువుగట్టు దేవాలయంలో జరిగిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గోన్నారు.అయనను అర్చకులు పూర్ణకుంభంతో మంత్రిని స్వాగతించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలుపై మంత్రి అధికారులను అడిగితెలుసుకున్నారు. ఎక్కడా ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల విరేశం కుడా కళ్యాణోత్సవంలో మంత్రితో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ భక్తులంతా భక్తిశ్రద్ధలతో.. ప్రశాంతంగా పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దంపతులను దర్శించుకోవాలని.. భోజనాలతో సహా అన్నీ సౌకర్యాలు కల్పించామని.. కాబట్టి ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఆ ఆది దంపతులను దర్శించుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే మూడు నెలల్లో బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేస్తాం. మొదటి విడతలో 60 వేల ఎకరాలకు నీటి విడుదల చేస్తాం. అదే రోజు మహాత్మాగాంధీ యూనివర్సిటీ, చెర్వుగట్టులో సీఎం రేవంత్ రెడ్డిచే సమీక్ష వుంటుంది. చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు, భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తాం. జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే కాలంలో బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్ బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించి పేదల గుండెల్లో ఉంటామని అన్నారు.
Tags
Related News
Drugs : నల్గొండ లో రూ.5 కోట్ల 10 లక్షల విలువ చేసే గంజాయిని తగలబెట్టిన పోలీసులు
రూ.5.10 కోట్ల విలువ చేసే మొత్తం 2,043 కిలోల గంజాయిని కాల్చి బూడిద చేశారు