Bhagavad Gita Teachings: కోపాన్ని జయించడం ద్వారానే నిజమైన విజయం!
గీత ప్రకారం.. మనిషి ఉద్ధరణ అతని చేతుల్లోనే ఉంటుంది. అతని మనస్సే అతనికి అతిపెద్ద మిత్రుడు. అదే అతిపెద్ద శత్రువు కూడా.
- Author : Gopichand
Date : 03-11-2025 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
Bhagavad Gita Teachings: శ్రీమద్భగవద్గీతలో (Bhagavad Gita Teachings) భగవాన్ శ్రీకృష్ణుడు “కర్మ చేయి, ఫలితం గురించి చింతించకు” అని చెబుతారు. గీతలోని ఈ సందేశం ముఖ్యంగా తరచుగా కోపంతో తమ ఓర్పును కోల్పోయే వ్యక్తులకు చాలా ప్రేరణాత్మకం. కోపం మన మనశ్శాంతిని దూరం చేయడమే కాక సంబంధాలలో బీటలు కూడా పడేలా చేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఓర్పు, సంయమనం, సమభావన (సమానత్వం) కలిగి ఉండటమే నిజమైన విజయం, సంతోషానికి మార్గం అని గీత బోధిస్తుంది. శ్రీమద్భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు. జీవితానికి మార్గదర్శి కూడా.
మనుష్యుడు జీవితంలోని కష్టాలు, వైఫల్యాలు, సమస్యలతో చిక్కుకున్నప్పుడు గీత అతనికి ఆత్మవిశ్వాసం, స్థిరత్వాన్ని అందిస్తుంది. గీత సందేశం నేటికీ చాలా సందర్భోచితమైనది. ఈ గ్రంథం మనకు ఓర్పు, వివేకం, ఆత్మనియంత్రణను నేర్పుతుంది. జీవితంలో చీకటి కమ్ముకున్నప్పుడు గీత జ్ఞానం ఒక దీపంలా దారి చూపిస్తుంది.
Also Read: SLBC Tunnel Collapse : ‘SLBC టన్నెల్ కూలిపోవడానికి కేసీఆరే కారణం’ – సీఎం రేవంత్ రెడ్డి
మనస్సు ప్రశాంతంగా ఉంటే జీవితంలో సమతుల్యత
గీత ప్రకారం.. మనిషి ఉద్ధరణ అతని చేతుల్లోనే ఉంటుంది. అతని మనస్సే అతనికి అతిపెద్ద మిత్రుడు. అదే అతిపెద్ద శత్రువు కూడా. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవితంలో సమతుల్యత (Balance), స్థిరత్వం వస్తాయి. కానీ మనస్సు కోపం, అహంకారం, లోభంతో నిండినప్పుడు అదే మనస్సు మనల్ని పతనం వైపు లాగుతుంది.
భగవాన్ శ్రీకృష్ణుడు గీతలోని అధ్యాయం 2, శ్లోకం 63లో ఇలా చెప్పారు. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి || అని ఉంది. అంటే కోపం నుండి భ్రమ కలుగుతుంది. భ్రమ నుండి జ్ఞాపకశక్తి నాశనం అవుతుంది. జ్ఞాపకశక్తి నాశనమైతే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనం అయితే మనిషి పతనమవుతాడు. ఈ శ్లోకం కోపం కేవలం ఒక భావోద్వేగం కాదని, అది వినాశనానికి మూలం అని తెలియజేస్తుంది. మనం కోపంతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు, పొరపాట్లు జరగడం ఖాయం.
కోపంపై నియంత్రణ
శ్రీకృష్ణుడి ప్రకారం.. కోపంపై నియంత్రణ కేవలం ఒక గుణం మాత్రమే కాదు, స్వీయ రక్షణకు ఒక మార్గం. మనం సంయమనం, వివేకంతో స్పందించడం నేర్చుకున్నప్పుడే మన మనస్సు నిజమైన శక్తితో నిండుతుంది. కోపం అనేది క్షణికమైన భావం. కానీ దాని పర్యవసానాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఇది మన వివేకాన్ని అంధకారం చేస్తుంది. సంబంధాలు, వృత్తి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కోపాన్ని నియంత్రించడానికి ఆత్మనియంత్రణ, సాధన, ధ్యానం అవసరమని గీత మనకు బోధిస్తుంది. మనం అంతర్గతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు.. బయటి పరిస్థితులు మనల్ని కలవరపెట్టలేవు.