డయాలసిస్ బాధితులకు వ్యాక్సిన్ వల్ల ఇంత మంచి జరుగుతుందా?
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్ రోగుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. దీనిలో డయాలసిన్ ఇన్ఫెక్షన్కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారని నిపుణులు గుర్తించారు.
- By Hashtag U Published Date - 03:51 PM, Thu - 30 September 21

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్ రోగుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. దీనిలో డయాలసిన్ ఇన్ఫెక్షన్కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారని నిపుణులు గుర్తించారు. రెండు డోసులు వేసుకోకపోయినా.. కేవలం ఒక్క డోసు వేసుకున్నవారు కూడా ఈ రిస్క్ నుంచి బయటపడినట్లు తేలింది. కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న మూత్ర పిండాల రోగులకు రక్షణ కలుగనుందని తెలియడంతో డయాలసిస్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పినట్లే అయింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్ రోగుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. డయాలసిస్ నెట్వర్క్ సంస్థ ‘నెఫ్రోప్లస్’ దేశవ్యాప్తంగా 150 పట్టణాలు, నగరాల్లో 32,235 మంది డయాలసిస్ రోగులపై ఇటీవల అధ్యయనం చేసి ఈ నివేదికను వెల్లడించింది.
సాధారణ ప్రజల్లో కరోనా వ్యాప్తి రేటు 0.44 శాతం ఉండగా డయాలసిస్ రోగుల్లో 8.7 శాతం ఉన్నట్లు నెఫ్రోప్లస్ పేర్కొంది. కరోనా కారణంగా డయాలసిస్ రోగుల మరణాలు మొదటి దశ ఉద్ధృతిలో 5శాతం పెరిగినట్లు గుర్తించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సెకండ్ వేవ్ లో 17,662 డయాలసిస్ పేషెంట్స్ పై చేసిన సర్వేలో.. వారందరికీ డెత్ రేట్ ఎక్కువగా ఉందని తేలింది. అయితే కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది ఇన్ఫెక్షన్కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయట పడ్డారని తెలిపారు
బీపీ, షుగర్, మూత్రపిండాల వైఫల్యం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఒకవేళ కరోనా బారిన పడినా.. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ముప్పు తప్పుతుందన్నారు. ఒక డోసు తీసుకున్న వారు సైతం ముప్పు నుంచి బయట పడినట్లు అధ్యయనంలో గుర్తించినట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. కోవిడ్ ఎంటర్ అవడంతో డయాలసిస్ రోగులు.. ఆందోళన వ్యక్తం చేశారు. తమకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందేమోనని వణికిపోయారు. అయితే ఇలాంటి వారికి వ్యాక్సిన్ మంచి ఫలితాలినివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.
Related News

COVID-19: చలికాలంలో పెరగనున్న కోవిడ్
మూడేళ్ళ క్రితం కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని వణికించేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీని భారీన పడ్డారు. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు.