ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్.. అప్డేట్ ఇదే!
మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా ఉంది. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
- Author : Gopichand
Date : 07-02-2026 - 10:29 IST
Published By : Hashtagu Telugu Desk
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మొదటి సింగిల్ “దేఖ్ లేంగే సాలా” సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించడమే కాకుండా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుండి రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. దీనికి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు.
Also Read: అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?
ఏ తరమైనా నీ తరమే …..
మా గుండెలో నీ స్థానం సుస్థిరమే….. #UstaadBhagatSingh @ThisIsDSP #Chandrabose 😍😍😍
— Harish Shankar .S (@harish2you) February 7, 2026
ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటలోని ప్రారంభ పంక్తులను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ పంక్తులు ఇలా ఉన్నాయి. “ఏ తరమైనా నీ తరమే.. మా గుండెల్లో నీ స్థానం సుస్థిరమే” అని ఉంది. ఈ సాహిత్యం కేవలం సినిమాలో కథానాయకుడి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ పట్ల అభిమానులకు ఉన్న ప్రేమాభిమానాలను ప్రతిబింబించేలా ఉంది. ఈ లైన్స్ చూస్తుంటే ఇది పక్కాగా పవర్ స్టార్ ఇమేజ్కు తగ్గట్టుగా ఉండే సాంగ్ అని అర్థమవుతోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్-DSP కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్ అనేది అభిమానుల నమ్మకం. ఈ రెండో పాట కూడా చార్ట్ బస్టర్ అవుతుందని, శ్రోతల మనసుల్లో సుదీర్ఘ కాలం నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా ఉంది. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తన పూర్తి స్థాయి మాస్ అవతార్లో అలరించనుండటంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.