Saiyaara : వామ్మో ఇది పేరుకే చిన్న సినిమా…బాక్స్ ఆఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్
Saiyaara : మొదట 8000 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం, పాజిటివ్ రెస్పాన్స్తో 10000 స్క్రీన్లకు పెరిగింది. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే 21.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి
- By Sudheer Published Date - 03:06 PM, Tue - 29 July 25

ఈ మధ్య బాలీవుడ్లో స్టార్స్ సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వస్తుండగా, ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా “సైయారా” (Saiyaara ) అద్భుత విజయాన్ని సాధించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆహాన్ పాండే హీరోగా, అనీత్ పడ్డా హీరోయిన్గా నటించారు. జూలై 18న విడుదలైన ఈ చిత్రం, విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మాడమైన వసూళ్లను సాధిస్తోంది. చిన్న చిత్రంగా వచ్చి బాలీవుడ్కు కొత్త ఊపిరిని ఇచ్చిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సినిమాలో భారీ బడ్జెట్దారుల సినిమాలా గ్రాఫిక్స్, ఫైట్లు ఉండకపోయినా.. బలమైన కథ, గొప్ప ఎమోషన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కథ సింపుల్గా ఉన్నా, స్క్రీన్ప్లేలో నూతనత, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రేక్షకుల హృదయాలను తాకింది. ముఖ్యంగా హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, లవ్ ప్రపోజ్ సీన్కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు “ఆ ఒక్క సీన్ కోసమే సినిమా చూడొచ్చు” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Tragedy : యూపీలో భర్తపై భార్య దారుణం.. భర్త సజీవదహనం
మొదట 8000 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం, పాజిటివ్ రెస్పాన్స్తో 10000 స్క్రీన్లకు పెరిగింది. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే 21.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ప్రస్తుతం వరల్డ్వైడ్గా 260 కోట్ల గ్రాస్ను అందుకుంది. ఈ రేట్ చూస్తే త్వరలోనే 300 కోట్ల క్లబ్లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విజయంతో బాలీవుడ్కి మళ్లీ పూర్వ వైభవం తిరిగొస్తుందన్న నమ్మకం కనిపిస్తోంది.
కథ విషయానికొస్తే.. క్రిష్ అనే యువకుడికి సంగీతం పట్ల అపారమైన మక్కువ ఉంటుంది. అతడి కల గొప్ప సంగీత దర్శకుడిగా ఎదగడం. ఈ క్రమంలో జర్నలిస్టు వాణి బాత్రాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. అదే సమయంలో వాణిని మోసం చేసిన మహేశ్ మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. ముగింపులో వాణి ఎవరిని పెళ్లి చేసుకుంది? క్రిష్ తన కలను నెరవేర్చాడా? అన్నదే కథ. ఇక ఈ చిత్రంపై సుకుమార్, మహేశ్ బాబు వంటి టాప్ సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపించడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.