Rajamouli: టైటిల్ లాంచ్ ఈవెంట్.. ఫ్యాన్స్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి!
టైటిల్ రివీల్ ఈవెంట్కు సంబంధించిన ప్రవేశ విధానంపై అనేక పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
- By Gopichand Published Date - 08:55 PM, Thu - 13 November 25
Rajamouli: భారతీయ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయికలోని అంతర్జాతీయ సాహస చిత్రానికి సంబంధించిన శుభవార్త వెలువడింది. ఈ ప్రాజెక్ట్కు తాత్కాలికంగా ‘SSMB29’ అనే పేరు పెట్టగా ఈ ప్రతిష్టాత్మక చిత్ర టైటిల్ను నవంబర్ 15, 2025న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో అంగరంగ వైభవంగా రివీల్ చేయనున్నారు. ఈ భారీ ఈవెంట్ ను జియో హాట్స్టార్ లో ప్రత్యేకంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వీక్షించవచ్చు.
ఈ గ్లోబ్ట్రోటింగ్ అడ్వెంచర్ చిత్రంలో అంతర్జాతీయ నటీనటులు ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖ తారలు కీలక పాత్రల్లో నటించనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: Minister Sridhar Babu: విద్యార్థుల విజయం టెక్నాలజీతోనే: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Very excited to see you all at the #Globetrotter event on November 15.
The RFC main gate will be closed on the event day. Follow the instructions on your entry pass. Cooperate with police and security to ensure a hassle-free, safe, and happy experience for everyone. pic.twitter.com/bG3Hw5XmD8
— rajamouli ss (@ssrajamouli) November 13, 2025
అభిమానులకు రాజమౌళి ప్రత్యేక విజ్ఞప్తి
టైటిల్ రివీల్ ఈవెంట్కు సంబంధించిన ప్రవేశ విధానంపై అనేక పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వేడుకను సురక్షితంగా, ఉల్లాసంగా నిర్వహించడానికి ఆయన అభిమానులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. కేవలం క్యూఆర్ కోడ్తో కూడిన పాస్లు ఉన్న అభిమానులకు మాత్రమే ఈవెంట్లోకి అనుమతి ఉంటుందని రాజమౌళి స్పష్టం చేశారు. 18 ఏళ్ల లోపు వారు, అలాగే వృద్ధులు తమ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఇంటి వద్ద నుండే లైవ్ స్ట్రీమ్లో ఈవెంట్ను చూడాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎంట్రీ మొదలవుతుందని ధృవీకరించారు. ఈవెంట్ ముగిసే వరకు RFC ప్రధాన ద్వారం మూసివేయబడుతుందన్నారు.
గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఈవెంట్ సజావుగా జరిగేలా సహకరించాలని, ఎటువంటి గందరగోళం తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ మెగా రివీల్ను పాస్లు ఉన్నవారు మాత్రమే సక్రమంగా హాజరై ఆస్వాదించాలని రాజమౌళి కోరారు. మహేష్ బాబు కెరీర్లో అత్యంత భారీ చిత్రంగా భావిస్తున్న ఈ ‘SSMB29’ టైటిల్ రివీల్ కోసం యావత్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. పాస్లు లేని లక్షలాది మంది అభిమానుల కోసం జియో హాట్స్టార్ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఇంటి నుండే చరిత్ర సృష్టించే ఈ క్షణాన్ని వీక్షించే అవకాశం ఉంది.