స్వామియే శరణమయ్యప్ప.. అయ్యప్ప సేవలో మెగా హీరో రాంచరణ్!
రాంచరణ్.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో. చరణ్ లుక్స్, స్టయిల్స్, డ్రెస్సింగ్ ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. ‘మ్యాన్ ఆఫ్ మాస్’ గా ఈ మెగా హీరోకు పేరుంది.
- By Balu J Published Date - 04:19 PM, Wed - 27 October 21

రాంచరణ్.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో. చరణ్ లుక్స్, స్టయిల్స్, డ్రెస్సింగ్ ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. ‘మ్యాన్ ఆఫ్ మాస్’ గా ఈ మెగా హీరోకు పేరుంది. హీరోయిన్స్ తో రొమాన్స్.. విలన్స్ తో ఫైట్స్ చేసే రాంచరణ్ ఒక్కసారిగా అయ్యప్ప మాలలో దర్శనమిస్తే..? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తుంటాడు. ఆయనకు, అయ్యప్ప స్వామికి ప్రత్యేకానుబంధం ఉంది. ఎన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నా రామ్ చరణ్ మాత్రం మాల ధరించకుండా ఉండడు. ప్రతి ఏడాది మాల ధరిస్తూ సామాన్య భక్తుడిలా అయ్యప్ప సేవలో మునిగిపోతుంటాడు.
రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్ష చేపట్టి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాడు. కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించే ముందు స్వామి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. 41 రోజుల ఆచారంలో భాగంగా, రామ్ చరణ్ కేవలం నలుపు బట్టలు ధరించి, చెప్పులు లేకుండా నడుచుకుంటూ కనిపించనున్నాడు. ఇటీవల తన తండ్రి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లాంచ్లో బ్లాక్ ప్యాంట్తో బ్లాక్ కుర్తా, స్టోల్ ధరించి కనిపించాడు. అతని నుదిటిపై టిక్కా చుక్కలు కూడా చూడవచ్చు. అయ్యప్ప దీక్షను పాటించడం ఇదే మొదటిసారి కాదు. మెగా పవర్ స్టార్ ప్రతి సంవత్సరం 41 లేదా 45 రోజుల పాటు ఇలా చేస్తుంటాడు. చిరంజీవి, సుమంత్, శింబు, మనోజ్ మంచు, వివేక్ ఒబెరాయ్, ఇతర ప్రముఖులు కూడా అయ్యప్ప దీక్ష చేయడం ద్వారా ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు.
చరణ్ తన రాబోయే చిత్రం RRR గ్రాండ్ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. బాహుబలి దర్శకుడు SS రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అక్టోబర్ 29 నుండి ప్రారంభం కానున్నాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లతో పాటు అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు, సముద్రఖని, రే స్టీవెన్సన్ మరియు అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. అయితే రామ్ చరణ్ దసరా రోజున రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పారు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా, ప్రశాంత్ నీల్తో మరో పాన్-ఇండియన్ మూవీని ప్రకటించాడు.
Hope u all had a great #Dussehra Loads of love & gratitude 🙏 pic.twitter.com/uiuOvFBMhB
— Upasana Konidela (@upasanakonidela) October 16, 2021
Related News

Telangana Elections : ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, అల్లు అర్జున్, రాంచరణ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా