Kriti Shetty: సమంత ఐటెం సాంగ్ పై కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్
కస్టడీ బ్యూటీ కృతి శెట్టి సమంత ఐటెం సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది
- By Balu J Published Date - 05:48 PM, Sat - 13 May 23
పుష్ప (Pushpa) మూవీలో ఊ అంటావా పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ ఐటెం సాంగ్ కు ఫిదా అయ్యారు. ఇక యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి పాటపై టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కస్టడీ సినిమా ప్రమోషన్ లో కృతి శెట్టి సమంత సాంగ్ గురించి మాట్లాడారు. తాను అలాంటి పాటలకు దూరమని తేల్చి చెప్పింది.
‘‘నన్ను అలాంటి పాటలకు అడిగితే ప్రస్తుతానికి అంగీకరించే స్థితిలో లేను. అలాంటి పాటలు ఎలా చేయాలన్న అవగాహన కూడా నాకు లేదు. ఇప్పటి వరకు నా కెరీర్లో నేను తెలుసుకున్నది ఒక్కటే. మనకు సౌకర్యంగా అనిపించనపుడు ఏదీ పడితే అది చేయకూడదు. కానీ నాకు ఊ అంటావా పాట ఇష్టమే. అందులో సమంత (Samantha) అద్భుతంగా డ్యాన్స్ చేశారు’’ అని రియాక్ట్ అయ్యింది.
‘శ్యామ్ సింగ రాయ్’లో లిప్ లాక్ (Lip Lock), ఇంటిమేట్ సీన్లు చేయడానికి తాను బాగా ఇబ్బంది పడ్డట్లు కృతి ఈ సందర్భంగా వెల్లడించింది. ‘‘ఆ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లలో నేను వంద శాతం మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. హార్ట్ ఫుల్గా చేయాలని అనిపించనుపుడు వాటిని వదిలేయడమే బెటర్ అనే విషయాన్ని అప్పుడే తెలుసుకున్నా. భవిష్యత్తులో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకునే ముందుకు సాగుతా’’ అని కృతి (Kriti Shetty) చెప్పింది.
Also Read: Sreeleela First Look: మెగా హీరోతో శ్రీలీల రొమాన్స్.. ఫస్ట్ లుక్ ఇదిగో
Related News
Jeevan Reddy: ఆర్మూర్ లోనే లక్ష మెజార్టీ.. నిజామాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ దే: జీవన్ రెడ్డి
Jeevan Reddy: ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చి నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు అఖండ విజయం చేకూరుస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ విజయాన్ని కాంక్షిస్తూ ఆర్మూర్ లో గురువారం జరిగిన నియోజకవర్గ స్థా