Bheema: గోపీచంద్ ‘భీమా’ నుంచి ఫస్ట్ సింగిల్ చూశారా
- By Balu J Published Date - 11:53 PM, Fri - 9 February 24
Bheema: మాచో స్టార్ గోపీచంద్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’ మేకర్స్ ఫస్ట్ ఆఫర్ టీజర్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎదో ఎదో మాయ సాంగ్ ని విడుదల చేశారు. టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్డ్రాప్ను, గోపీచంద్ పాత్రను టఫ్ కాప్గా పరిచయం చేయడంపై దృష్టి పెట్టగా, ఫస్ట్ సింగిల్ ద్వారా భీమా ప్రేమ కథను ప్రజెంట్ చేశారు.KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ స్వరపరిచిన ఎదో ఎదో మాయ అద్భుతమైన రొమాంటిక్ నంబర్. కంపొజింగ్ చాలా ప్లజెంట్ వుంది , వెంటనే పాటతో ప్రేమలో పడతాము.
కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం కథానాయకుడు తాను గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి పట్ల చూపే ఆరాధనను వర్ణిస్తుంది. అతను ఆమెతో సమయం గడపడానికి తన ఇగోలను పక్కన పెట్టే పోలీసు. టీచర్గా పరిచయమైన మాళవిక శర్మ కూడా పిల్లలతో కలిసి మెలిసి వారికి సహాయం చేస్తూ కనిపించింది. గోపీచంద్, మాళవిక జంట తెరపై లవ్లీ, బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ కట్టిపడేసింది. మొత్తంమీద పాట శాశ్వతమైన ముద్ర వేస్తుంది.ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ మరో కథానాయిక. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీని, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.ఇటీవల మేకర్స్అనౌన్స్ చేసినట్లుగా ‘భీమా’ మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రానుంది. తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
Tags
Related News
Sharwanand: శర్వానంద్ ‘మనమే’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది
Sharwanand: హీరో శర్వానంద్ 35వ చిత్రం ‘మనమే. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత. మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన�