Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం పట్ల చిరు, తారక్ దిగ్భ్రాంతి!
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒడిశా రైలు ప్రమాద ఘటనపై స్పందిచారు.
- By Balu J Published Date - 12:24 PM, Sat - 3 June 23
నిన్న అర్ధరాత్రి జరిగిన ఓడిశా రైలు ప్రమాదం ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన పలువురిని కలిచివేసింది. ఈ ప్రమాదంలో కనీసం 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఒడిశా రైలు ప్రమాదంపై తెలుగు సూపర్ స్టార్స్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ ఒడిశాలో విషాదకరమైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఊహించని ప్రాణనష్టం పట్ల షాక్ తిన్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
‘‘ప్రాణాలను కాపాడేందుకు రక్తం అత్యవసరంగా అవసరమని నేను అర్థం చేసుకున్నాను అని ఆయన అన్నారు. రక్తదానం కోసం అన్ని విధాలా సహాయాన్ని అందించాలని మా అభిమానులందరికీ, సమీప ప్రాంతాలలోని గొప్ప వ్యక్తులకు ఇది విజ్ఞప్తి’’ అని చిరంజీవి అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ‘‘విషాద రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ విధ్వంసకర సంఘటన ప్రతిఒక్కరిపై ప్రభావితం చూపింది. ఈ క్లిష్ట సమయంలో ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులు బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నా’’ అని సంతాపం వ్యక్తం చేశారు.
Utterly shocked at the tragic Coromandel express accident in Orissa and the huge loss of lives! My heart goes out to the bereaved families.
I understand there is an urgent demand for blood units to save lives. Appeal to all our fans and good samaritans in the nearby areas to…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
Heartfelt condolences to the families and their loved ones affected by the tragic train accident. My thoughts are with each and every person affected by this devastating incident. May strength and support surround them during this difficult time.
— Jr NTR (@tarak9999) June 3, 2023
Also Read: Babu Delhi Tour: ఢిల్లీకి చంద్రబాబు, మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ?
Related News
Devara : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆల్ హెయిల్ టైగర్..
'దేవర' ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసిన ఎన్టీఆర్. ఆల్ హెయిల్ టైగర్ అంటూ..