HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Case Filed On Bholaa Shankar Movie And Producers By Vizag Distributor

Bholaa Shankar : ‘భోళా శంకర్’కు రిలీజ్‌కి ముందు షాక్.. 30 కోట్లు మోసం చేసారంటూ నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్ కేసు..

గాయత్రి ఫిలిమ్స్ అధినేత బత్తుల సత్యనారాయణ నేడు భోళా శంకర్ నిర్మాతలు AK ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు 30 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని చెప్తూ ఓ వీడియోని రిలీజ్ చేసి అలాగే కోర్టులో కేసు వేశాం అంటూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.

  • By News Desk Published Date - 09:47 AM, Wed - 9 August 23
  • daily-hunt
Case Filed on Bholaa Shankar Movie and Producers by Vizag Distributor
Case Filed on Bholaa Shankar Movie and Producers by Vizag Distributor

AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా భోళా శంకర్(Bholaa Shankar) సినిమా తెరకెక్కింది. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తమన్నా(Tamannaah) హీరోయిన్ గా, కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవికి చెల్లెలిగా, సుశాంత్ ముఖ్య పాత్రలో తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. అయితే సినిమా రిలీజ్ కి రెండు రోజులు ఉందనగా చిత్రయూనిట్ కి ఓ డిస్ట్రిబ్యూటర్ షాక్ ఇచ్చాడు.

ప్రముఖ వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గాయత్రీ ఫిలిమ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి టాలీవుడ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు కూడా వైజాగ్ ఏరియా అంతా చాలా వరకు పెద్ద సినిమాలన్నీ గాయత్రి దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటుంది. గాయత్రి ఫిలిమ్స్ అధినేత బత్తుల సత్యనారాయణ నేడు భోళా శంకర్ నిర్మాతలు AK ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు 30 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని చెప్తూ ఓ వీడియోని రిలీజ్ చేసి అలాగే కోర్టులో కేసు వేశాం అంటూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.

వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గాయత్రీ ఫిలిమ్స్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో.. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ నన్ను మోసం చేయడంతో వారి నిజ స్వరూపం బట్టబయలు అయింది. వారు చేసిన అన్యాయం ఏమిటో ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ ఆఖరులో విడుదలైన “ఏజెంట్” సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి 30 కోట్ల రూపాయలు తీసుకుని మరీ వారు నన్ను పచ్చిగా మోసగించారు. బ్యాంకు అకౌంట్ రూపంలో నా సహచర వ్యాపార మిత్రుల సహకారంతో 30 కోట్ల రూపాయల వైట్ మనీని “ఏజెంట్” సినిమా మూడు రాష్ట్రాల హక్కుల కోసం నేను చెల్లించినట్లు పక్కాగా ఆధారాలు ఉన్నప్పటికీ, వారు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేసి, అగ్రిమెంట్ కు తూట్లు పొడిచారు.

 

ఆ తర్వాత మే 1వ తేదీన హైదరాబాద్ లోని వారి ఆఫీస్ కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ ను కలవడం జరిగింది. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు ఎదురయ్యాయి. సినిమా డిజాస్టర్ ప్లాప్ అయ్యిందని చెప్పి, మరుసటి రోజు అనగా మే 2వ తేదీన మళ్ళీ ఆఫీసుకు వస్తే, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని నాకు చెప్పారు. ఆ మేరకు నాకు అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత వారు చేసిన “సామజవరగమన” చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు ఇచ్చారు. ఆ చిత్రం ద్వారా కేవలం చాలా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది. ,ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఒప్పంద పత్రం చేశారు.

అయితే వారి తదుపరి సినిమా “భోళా శంకర్” అయ్యింది. కొద్ది రోజులుగా వారు నాకు సమాధానం ఇవ్వడం మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా ఈ విషయం చెప్పి, సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడం కోసం తప్పనిసరి పరిస్థితులలో కోర్టుకు వెళ్లడం జరిగింది. విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ గా సినీ పరిశ్రమతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థలం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను అలాగే ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పైన వారు నిర్మించిన అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. గతంలో ఎప్పుడూ డబ్బు గురించిన సమస్యలు కానీ మోసాలు కానీ తలెత్తలేదు. అయితే ఇప్పుడు AK ఎంటర్టైన్మెంట్స్ వారు నా దగ్గర 30 కోట్లు తీసుకుని, సరిగ్గా సమాధానం చెప్పకుండా, ఎగొట్టాలనే తలంపుతో ఆఖరికి నా మీద ఫోర్జరీ చేశాననే నింద కూడా వేశారు. వాస్తవానికి ఆ మధ్య యూరోస్ ఇంటర్నేషనల్ వారికి వీరు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో వీరిపై ఆ సంస్థ కేసులు కూడా పెట్టింది. అలాగే ఎంతోమందిని మోసం చేస్తూ, వీరు తమ గుడ్ విల్ ను పోగొట్టుకున్నారు.

ఇంకా ఎంతోమందికి వీరు బాకీలు ఉన్నారు. నా నీతి, నిజాయితీ ఏమిటో సినీ పరిశ్రమతో పాటు అందరికీ తెలుసు. అయితే తెలియని వారికోసమే తప్పనిసరి పరిస్థితులలో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నాకు న్యాయం జరగాలని ఆశిస్తూ అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. మరోవైపు క్రిమినల్ కేసు కూడా వారిపై ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఫైనాన్సియర్స్ అందరి పైన ఈడీకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. వారు నటించిన సినిమా అన్న ఉద్దేశ్యంతోనే నేను ఆచితూచి ఇంతవరకు ఎక్కడా మీడియాకు ఎక్కకుండా ముందుకు సాగాను. నా మీద ఎప్పుడైతే ఫోర్జరీ నింద వేసి, ఆ వార్తలను గ్రూపులలో తిప్పిస్తూ, నన్ను అప్రదిష్టపాలు చేస్తున్నారు. అయినా నిజాయితీ, న్యాయం,గెలుస్తాయని నేను నమ్ముతున్నాను. నేడు బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడుతాం. వాస్తవాలను మీడియా ముందు ఉంచుతాం అని డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ తెలిపారు.

దీంతో ఈ విషయం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మెగాస్టార్ సినిమా రిలీజ్ కి ముందు కోర్టులో కేసు అవ్వడంతో ఈ వార్త మరింత వైరల్ అయింది. మరి ఈ సమస్య సినిమా రిలీజ్ కి ముందే సాల్వ్ అవుతుందా? చిరంజీవి ఈ విషయంలో కలగచేసుకుంటాడా? AK ఎంటర్టైన్మెంట్స్ దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి మరి..

 

Also Read : Guntur Kaaram : గుంటూరు కారం.. మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్ పోస్టర్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anil Sunkara
  • Battula Satyanarayana
  • Bholaa Shankar
  • chiranjeevi
  • Court Case
  • Vizag Distributor

Related News

Pawan Kalyan

Pawan Kalyan: అల్లు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారని ప‌వ‌న్ గుర్తు చేశారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖని తీర్చిదిద్దారని పేర్కొన్నారు.

    Latest News

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd