Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమా సెట్లో ప్రమాదం.. విషమంగా యువకుడి పరిస్థితి..!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్'. ఈ సినిమా సెట్స్ నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా సెట్స్లో ప్రమాదం జరిగింది.
- Author : Gopichand
Date : 20-03-2023 - 9:46 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’. ఈ సినిమా సెట్స్ నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా సెట్స్లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు వంద అడుగులు ఎత్తు నుంచి 19 ఏళ్ల కుర్రాడు కింద పడిపోయాడు. మీడియా కథనాల ప్రకారం యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ చిత్రం షూటింగ్ పన్హాలాలో జరుగుతోంది. సజ్జా కోఠి ప్రాంతంలో సినిమా సెట్ని ఏర్పాటు చేశారు. శ
నివారం రాత్రి 8.30 గంటల నుంచి షూటింగ్ మొదలైంది. షూటింగ్ కోసం గుర్రాలను తీసుకొచ్చారు. దాని కోసం గుర్రాన్ని చూసుకోవడానికి నగేష్ ఖోబర్ వచ్చాడు. ఈ క్రమంలో నగేష్కి ఫోన్ రావడంతో కొండ కోనేరులో నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫోన్ మాట్లాడి నగేష్ వెనుదిరిగిన వెంటనే 100 అడుగుల నుంచి కింద పడిపోయాడు. ఈ విషయం తెలియగానే ఇద్దరు వ్యక్తులు తాడు సహాయంతో కిందకు దిగారు. అనంతరం నగేష్ను తాడుతో కట్టి పన్హల్గఢ్కు తీసుకొచ్చారు.
Also Read: Salman Khan Gets Threat Mail: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్కు బెదిరింపు ఈ-మెయిల్
నివేదికల ప్రకారం.. నగేష్ తల, ఛాతీకి బలమైన గాయాలయ్యాయి. ఆ వెంటనే నగేష్ను కొల్హాపూర్కు పంపారు. మహారాష్ట్రలోని నగేష్ సి.పి.ఆర్. ఆసుపత్రిలో చేర్పించారు. అయితే నగేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నగేష్ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పన్హాలా పోలీసులు ఇప్పుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే ఇప్పటి వరకు పోలీసులు లేదా మహేష్ మంజ్రేకర్ బృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తున్నారు. అదే సమయంలో మహేష్ మంజ్రేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది.