Prabhas Car Collection: ప్రభాస్ గ్యారేజ్.. ఇచ్చట అన్ని రకాల కార్లు ఉండబడును!
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) సైతం గ్యారేజ్ లో కూడా ఖరీదైన కార్లు ఉన్నాయట.
- By Balu J Published Date - 01:23 PM, Sat - 4 February 23
టాలీవుడ్ (Tollywood) స్టార్స్ కు కార్లంటే చాలా ఇష్టం. మన స్టార్స్ కు పెద్ద పెద్ద ఖరీదైన కార్లున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) సైతం గ్యారేజ్ లో కూడా ఖరీదైన కార్లు ఉన్నాయట. ప్రభాస్ సేకరించిన లగ్జరీ కార్లను చూసేందుకు టాలీవుడ్ నటీనటులు కూడా ఇష్టం చూపుతారంటే ఆయన దగ్గరున్న కార్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ స్టార్ హీరో 2021లో కొనుగోలు చేసిన లంబోర్ఘిని అవెంటడోర్ రోడ్స్టర్ అత్యంత ఖరీదైన కార్ల (Costly Cars)లో ఒకటి. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
తాజాగా ప్రభాస్ (Prabhas) కాస్ట్ లీ కారు ఒకటి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రభాస్ అప్ కమింగ్ డైరెక్టర్ మారుతీ ఇటీవల హైదరాబాద్లో రైడ్ కోసం ప్రభాస్ లంబోర్గినీ (Lamborghini)ని నడిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ మారుతి (Maruthi) తన సోషల్ మీడియాలో ఇదే వీడియోను పోస్ట్ చేసి “మేం ప్రేమ కోసం ప్రార్థించం, మేం కార్ల కోసం ప్రార్థిస్తాం” అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రభాస్ 2021లో కొనుగోలు చేసినప్పుడు సూపర్ లగ్జరీ లాంబోర్ఘిని అవెంటడోర్ చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని ధర దాదాపు రూ. 6 కోట్లుగా తెలుస్తోంది.
విలాసవంతమైన కార్లకు ప్రభాస్ (Prabhas) విపరీతమైన అభిమాని అని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తర్వాత టాలీవుడ్ లో ప్రభాస్ వద్ద ఆ స్థాయి ఖరీదైన కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఇప్పటికే ప్రభాస్ షెడ్ లో ఉంది. అంతే కాకుండా.. రిట్జీ BMW X3 మరియు విలాసవంతమైన జాగ్వార్ XJR లాంటి (Car Collections) కార్లు ఆకట్టుకుంటాయి. ఈ నటుడు తరచూ హైదరాబాద్ వీధుల్లో కారు నడుపుతూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ పాన్-ఇండియా స్టార్ తన రాబోయే చిత్రాలైన ఆదిపురుష్, సాలార్, రాజా డీలక్స్ మరియు ప్రాజెక్ట్ కె లాంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
Related News
Amit Shah ‘Deepfake’ Video Case: ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.