Aaradhya Bachchan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనమరాలు.. కారణమిదే..?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యల కుమార్తె ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) ఈ మధ్య తరచుగా వార్తల్లో ఉంటున్నారు.
- By Gopichand Published Date - 09:11 AM, Thu - 20 April 23

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యల కుమార్తె ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) ఈ మధ్య తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఏదో ఒక ఈవెంట్లో తన తల్లితో కలిసి కనిపించిన ఆరాధ్య లుక్ ఆమెను ట్రోల్లకు గురిచేస్తుంది. అయితే ఆరాధ్య వార్తల్లో ఉండటానికి కారణం ఆమె హైకోర్టు తలుపు తట్టడమే. ఆరాధ్య ఒక యూట్యూబ్ టాబ్లాయిడ్పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
అమితాబ్ బచ్చన్ మనవరాలు, ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ తన ఆరోగ్యంపై ‘ఫేక్ న్యూస్’ని నివేదించినందుకు యూట్యూబ్ టాబ్లాయిడ్పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. 11 ఏళ్ల బాలిక, మైనర్ అయినందున మీడియా అటువంటి రిపోర్టింగ్పై నిషేధం విధించాలని కోరింది.
Also Read: Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు.. రాఖీ సావంత్కు వార్నింగ్..!
మరి ఏప్రిల్ 20న (గురువారం) ఎలాంటి విచారణ జరుగుతుందో చూడాలి. ఆరాధ్య బచ్చన్ మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. నెటిజన్లు ఎక్కువగా ఆమె లుక్స్ కోసం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆమె పలుమార్లు ట్రోలింగ్కు గురైంది. ఇటీవల, అభిషేక్ బచ్చన్ తన కుమార్తె గురించి కొన్ని విషయాలు విన్న తర్వాత తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. బాబ్ బిస్వాస్ ప్రమోషన్స్ సమయంలో కోపంతో అభిషేక్ తన కూతురిని టార్గెట్ చేసే ట్రోల్స్పై విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియాలో ఆరాధ్యకు వస్తున్న ప్రతికూలతపై అభిషేక్ స్పందిస్తూ.. ‘ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. నేను సహించను. నేను పబ్లిక్ ఫిగర్ని, అది బాగానే ఉంది, నా కూతురికి దానితో సంబంధం లేదు. ఎవరికైనా ఏదైనా చెప్పాలని ఉంటే వచ్చి నా ముఖం మీద చెప్పండి.’ అంటూ అప్పట్లో అభిషేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.