Allu Arjun: ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బన్నీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ లెటర్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో. టాలీవుడ్లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఆయనతో సినిమాలు చేయటానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఆయన కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన ఇమేజ్ను రోజు రోజుకీ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు.
- By Gopichand Published Date - 01:29 PM, Tue - 28 March 23
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో. టాలీవుడ్లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఆయనతో సినిమాలు చేయటానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఆయన కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన ఇమేజ్ను రోజు రోజుకీ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు. సినిమా సినిమాకు తనని తాను మెరుగు పరుచుకుంటూ నటనతో పాటు డాన్సుల్లోనూ తనదైన గ్రేస్ను క్రియేట్ చేసుకున్నారు. తననను విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ ప్రయాణానికి అక్షరాలా 20 ఏళ్లు. అల్లు అర్జున్ ఈ స్థాయికి చేరుకున్నారనటంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఆయన తన రెండు దశాబ్దాల ప్రయాణం గురించి ఓ భావోద్వేగ లేఖను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్.
‘‘సినీ రంగంలో ఈరోజుతో నేను 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నాపై చూపించిన ప్రేమ చూస్తే నేనెంతో అదృష్టవంతుడిని. సినీ ఇండస్ట్రీలోని నా సన్నిహితులకు ధన్యవాదాలు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణం ప్రేక్షకులు, అభిమానులు, నన్నెంతగానో ఇష్టపడేవారు చూపించిన ప్రేమ. మీకెప్పటికీ కృతజ్ఞతలతో ఉంటాను’’ అని తెలిపారు అల్లు అర్జున్. బన్నీ పోస్ట్పై సమంత, లక్ష్మీ మంచు సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు.
Also Read: Priyanka banned: హాలీవుడ్లో బాలీవుడ్ రచ్చ! కంగనా ట్వీట్
Today, I complete 20 years in the film industry. I am extremely blessed & have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers & fans . Gratitude forever 🙏🏽
— Allu Arjun (@alluarjun) March 28, 2023
అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి మార్చి 28, 2003లో విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పటి నుంచి బన్నీ డిఫరెంట్ మూవీస్తో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి పుష్ప 2 ది రూల్, రెండోది సందీప్ వంగా దర్శకత్వంలో చేయబోతున్న బాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగానే సందడి చేయబోతున్నాయి. మరోవైపు పుష్ప.. ది రైజ్ నిర్మాతలు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ గ్లింప్స్ను టీజర్ రూపంలో విడుదల చేయనున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసింది చిత్ర బృందం. విశాఖపట్నంలో జరిగే మేజర్ షెడ్యూల్లో చాలా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
Related News
Pushpa 2 : పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో.. రూల్ చేసేందుకు రెడీ..!
Pushpa 2 పుష్ప 2 నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా ఇప్పుడు పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.