HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Soon Satellite Telecom Sevices In India Too How Does It Work How Much Is The Charge Which Companies Provide Connection

Satellite Telecom: మనకూ శాటిలైట్‌ టెలికాం.. ఛార్జీ ఎంత ? ఏ కంపెనీలు కనెక్షన్ ఇస్తాయి ?

జియో - ఎస్‌ఈఎస్‌ కమ్యూనికేషన్స్(Satellite Telecom) అనేది ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీ.

  • By Pasha Published Date - 08:47 AM, Sun - 16 February 25
  • daily-hunt
Internet
Internet

Satellite Telecom: మన దేశంలోనూ త్వరలో శాటిలైట్‌ టెలికాం సేవలు షురూ కానున్నాయి. నేరుగా శాటిలైట్ నుంచే మన ఫోన్‌కు టెలికాం సిగ్నల్‌ను అందించడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. దీనివల్ల సెల్‌ఫోన్ టవర్ల అవసరం తప్పుతుంది. సెల్‌ఫోన్ టవర్లు లేని ప్రాంతాల్లో కూడా దర్జాగా మనం ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.  ప్రస్తుతానికి శాటిలైట్ కమ్యూనికేషన్  సేవలను అందించేందుకు  భారత ప్రభుత్వం నుంచి కేవలం రెండు సంస్థలకే లైసెన్సు లభించింది.  అవి.. వన్‌వెబ్‌ ఇండియా కమ్యూనికేషన్స్, జియో – ఎస్‌ఈఎస్‌ కమ్యూనికేషన్స్‌.

Also Read :Delhi Railway Station Stampede : ఢిల్లీ తొక్కిసలాటకు ఆ పుకారే కారణమా..?

ఈ కంపెనీలు రెడీ.. 

జియో – ఎస్‌ఈఎస్‌ కమ్యూనికేషన్స్(Satellite Telecom) అనేది ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీ. ఈ సేవలను అందించేందుకు లగ్జంబర్గ్ దేశానికి చెందిన ఎస్‌ఈఎస్‌ సంస్థ,  రిలయన్స్‌ జియోతో  చేతులు కలిపింది.ఇక  ఫ్రాన్స్‌కు చెందిన  యూటెల్‌శాట్‌ కంపెనీ మన దేశానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్‌  కలిసి సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ద్వారా భారత్‌లో శాటిలైట్ టెలికాం సేవలను అందించనున్నారు.  ఈ సేవలను అందించేందుకు వన్‌వెబ్‌ ఇండియా ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది. గుజరాత్, తమిళనాడుల్లో బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కేంద్ర సర్కారు నుంచి  అనుమతులు రాగానే శాటిలైట్ టెలికాం సేవలను ప్రారంభిస్తారు.  జియో–ఎస్‌ఈఎస్‌ సంస్థ కూడా భారత్‌లోని రెండు ప్రాంతాల్లో బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది.  అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సంస్థ ఇప్పటికే 100కుపైగా దేశాల్లో శాటిలైట్ టెలికాం సేవలను మొదలుపెట్టింది. ఇది మనదేశంలోనూ లైసెన్స్‌ కోసం అప్లై చేసింది. అమెజాన్‌ గ్రూప్‌కు చెందిన కైపర్‌ సంస్థ కూడా ఈ సేవల రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

Also Read :Nara Lokesh Warning : తప్పు చేసిన ఏ వైసీపీ నేతను వదిలిపెట్టను – మంత్రి లోకేష్

రీఛార్జ్..  ఎంత రేటు ? 

శాటిలైట్ టెలికాం సేవలు .. మన సాధారణ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల కంటే ఖరీదైనవే. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కోసం మనం ప్రతినెలా రూ.600 నుంచి రూ.4వేల దాకా ఖర్చు చేస్తున్నాం.  అవసరాన్ని బట్టి రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటున్నాం. అయితే శాటిలైట్ టెలికాం రీఛార్జ్ ప్లాన్లు వీటి కంటే 7 నుంచి 18 రెట్లు ఎక్కువ కాస్ట్లీ. సైన్యం, నావికా దళం, లగ్జరీ హోటళ్లు, కొండ ప్రాంతాల్లోని రిసార్టులకు ఇది ఉపయోగపడుతుంది. ఎయిర్ టెల్‌కు చెందిన వన్ వెబ్ సేవలను వినియోగించుకుంటామని భారత ఆర్మీ ప్రకటించింది. శాటిలైట్ టెలికాం కనెక్షన్‌ను తీసుకునేందుకు మనం సదరు కంపెనీకి చెందిన యాంటెనాను కొనాలి.  దీని ధర ప్రస్తుతం అమెరికా లాంటి దేశాల్లో దాదాపు రూ.8వేల దాకా ఉంది. మన దేశంలో దీని ధర రూ.5వేలలోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్రమంగా రాబోయే కొన్నేళ్లలో తక్కువ ఖర్చుతోనే శాటిలైట్ టెలికాం కనెక్షన్ దొరుకుతుందని అంటున్నారు. యాంటెనాల ధర కూడా తగ్గుతుందని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • satellite communication
  • Satellite Internet
  • Satellite Telecom
  • Satellite Telecom Companies
  • Satellite Telecom Sevices

Related News

America

America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్‌ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.

  • IND vs SL

    IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Gen Z Protest Possible Ktr

    Gen Z Protest Possible In India : భారత్లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd