SBI: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. ఇకపై చౌకగా లోన్స్!
టారిఫ్ అంశం, ఆర్థిక సంస్కరణల కోసం ఆర్బీఐ చేపట్టిన చర్యల మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. బ్యాంక్ పాలసీ రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు చేసి, కస్టమర్లకు ఇచ్చే రుణాలను చౌక చేసింది.
- By Gopichand Published Date - 02:00 PM, Tue - 15 April 25

SBI: టారిఫ్ అంశం, ఆర్థిక సంస్కరణల కోసం ఆర్బీఐ చేపట్టిన చర్యల మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. బ్యాంక్ పాలసీ రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు చేసి, కస్టమర్లకు ఇచ్చే రుణాలను చౌక చేసింది. ఈ కొత్త తగ్గింపు తర్వాత ఎస్బీఐ రెపో రేటుతో లింక్ చేయబడిన రుణ రేటు 0.25 శాతం తగ్గి 8.25 శాతంగా ఉంది.
ఎస్బీఐ బాహ్య బెంచ్మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్)ను కూడా 0.25 శాతం తగ్గించింది. దీని తర్వాత ఇది 8.65 శాతంగా నిలిచింది. సవరించిన కొత్త రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయి. గత వారం ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థకు ఊపు నిచ్చేందుకు వరుసగా రెండోసారి రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు ప్రకటించిన విషయం గమనార్హం. దీని తర్వాత ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్లు చౌకయ్యాయి.
అయితే, బ్యాంక్ డిపాజిటర్లకు కూడా షాక్ ఇచ్చింది. ఇప్పుడు బ్యాంక్లో డిపాజిట్ చేసే వడ్డీ రేట్లలో 0.10 శాతం నుంచి 0.25 శాతం వరకు తగ్గింపు చేశారు. ఈ కొత్త రేటు అమలు తర్వాత, మూడు కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు ఒకటి నుంచి రెండేళ్ల కాలవ్యవధికి వడ్డీ రేటు 0.10 శాతం తగ్గి 6.70 శాతంగా నిర్ణయించబడింది. అలాగే, రెండేళ్లు లేదా మూడేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఎఫ్డీలపై ఇచ్చే వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.90 శాతంగా తగ్గించారు.
Also Read: Liquor scam in AP : తాడేపల్లి ప్యాలెస్కు రూ.3 వేల కోట్లు..?
ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా తన కస్టమర్లకు షాక్ ఇస్తూ సేవింగ్స్ అకౌంట్పై వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపు చేసింది. దీని తర్వాత కొత్త రేటు 2.75 శాతంగా ఉంది. ఇది ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే అత్యంత తక్కువ. ఇప్పుడు 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్లకు వడ్డీ రేటు గతంలో 3.5 శాతం ఉండగా, ఇప్పుడు 3.25 శాతంగా తగ్గింది. హెచ్డీఎఫ్సీ వెబ్సైట్ ప్రకారం.. ఈ తగ్గింపు ఏప్రిల్ 12 నుంచి అమలులో ఉంది.
అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాల వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపు చేసింది. అలాగే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ను ఉపసంహరించుకునే ప్రకటన చేసింది. దీనిలో 7.3 శాతం వడ్డీ ఇవ్వబడుతోంది