Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా పేపర్ లెస్..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు అంటే మంగళవారం నాడు మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు.
- By Gopichand Published Date - 10:31 AM, Tue - 23 July 24

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు అంటే మంగళవారం నాడు మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఏడో బడ్జెట్. లోక్సభ ఎన్నికలకు ముందు తొలుత మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై మధ్యతరగతి, రైతులు, మహిళలు, వ్యాపారులు సహా ప్రతి వర్గానికి ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆర్థిక మంత్రి ఉదయం 11 గంటలకు పార్లమెంటు దిగువ సభ అయిన లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు.
మోదీ ప్రభుత్వ 11వ బడ్జెట్లో 2047 వరకు రోడ్మ్యాప్ను చూపనున్నారు. ఇది కాకుండా గత రెండు పర్యాయాలు మోడీ ప్రభుత్వం చేసిన సంక్షేమం కూడా బడ్జెట్లో చూడవచ్చు. ఈసారి బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబులను మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా రైతులకు సంబంధించిన పెద్ద ప్రకటనలు కూడా చేయవచ్చు. అభివృద్ధి చెందుతున్న భారత్ వ్యూహం కూడా ఇందులో వెల్లడవుతుంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను పెంచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవచ్చు. దీంతో పాటు ఉపాధిని పెంచేందుకు కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. గ్రీన్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
Also Read: Kiran Abbavaram Ka Business : కిరణ్ అబ్బవరం లక్కు అలా ఉంది. ఒక రేంజ్ లో క బిజినెస్..!
ఆర్థిక మంత్రి పార్లమెంటు భవనానికి చేరుకున్నారు
లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ టాబ్లెట్ను తీసుకుని పార్లమెంటుకు చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూ కాశ్మీర్ (అసెంబ్లీతో కూడిన) కేంద్ర పాలిత ప్రాంతం (2024-25) అంచనా వేసిన వసూళ్లు, వ్యయాలను కూడా ఈరోజు పార్లమెంటులో సమర్పించనున్నారు.
#WATCH | Finance Minister Nirmala Sitharaman carrying the Budget tablet arrives at Parliament along with her team, to present the Union Budget in Lok Sabha. pic.twitter.com/vvRetDyiGg
— ANI (@ANI) July 23, 2024
పేపర్ లెస్ బడ్జెట్
ఈసారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘పేపర్ లెస్’ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ట్యాబ్లో బడ్జెట్కు సంబంధించిన విరాలను నిర్మల సీతారామన్ తీసుకొచ్చారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత బడ్జెట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించనుంది. ఈ బడ్జెట్లో ఏ రంగాలకు ఎంత కేటాయించారో తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.