Jan Dhan Accounts: జన్ ధన్ యోజన.. 53.13 కోట్ల ఖాతాల్లో 29.56 కోట్ల ఖాతాలు మహిళలవే!
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 10వ వార్షికోత్సవం సందర్భంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ పథకం ప్రభుత్వానికి చాలా సహాయపడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
- By Gopichand Published Date - 09:45 AM, Wed - 28 August 24

Jan Dhan Accounts: 10 సంవత్సరాల క్రితం ఆగస్టు 28, 2014న ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (Jan Dhan Accounts) పూర్తిగా విజయవంతమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం దేశంలో 53.13 కోట్ల జన్ ధన్ ఖాతాలున్నాయి. వీటిలో దాదాపు 80 శాతం ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే ఆగస్టు 2024 నాటికి ఈ ఖాతాల సగటు బ్యాలెన్స్ రూ.4352గా మారింది. ఇది మార్చి 2015లో రూ.1,065గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 కోట్ల జన్ధన్ ఖాతాలను ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
నేడు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 10వ వార్షికోత్సవం
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 10వ వార్షికోత్సవం సందర్భంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ పథకం ప్రభుత్వానికి చాలా సహాయపడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీని వల్ల మహిళలు కూడా ఎంతో ప్రయోజనం పొందారు. ఈ ఖాతాలలో జీరో బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించాల్సిన బాధ్యత లేదు. ఇదిలావుండగా 8.4 శాతం ఖాతాల్లో మాత్రమే జీరో బ్యాలెన్స్ ఉంది. ఈ పథకం గ్రామాలు, పట్టణాలలో నివసించే ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాంతాల్లో 66.6 శాతం జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి.
Also Read: Railway Stations : 8 రైల్వే స్టేషన్లకు స్వామీజీలు, స్వాతంత్య్ర యోధుల పేర్లు
53.13 కోట్ల ఖాతాల్లో 29.56 కోట్ల ఖాతాలు మహిళలవే
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆగస్టు 14, 2024 నాటికి.. 53.13 కోట్ల ఖాతాలలో మహిళల ఖాతాలు దాదాపు 55.6 శాతం (29.56 కోట్లు) ఉన్నాయి. దేశంలోని దాదాపు 99.95 శాతం గ్రామాల నుండి 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు శాఖలు, ATMలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో సహా కొన్ని టచ్పాయింట్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో 1.73 బిలియన్లకు పైగా ఆపరేటివ్ కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాలు ఉన్నాయి. వీటిలో 53 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
సామాజిక భద్రతా పథకాల ద్వారా కోట్లాది మందికి ఉపశమనం
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 20 కోట్ల మందికి రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా కల్పించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద దాదాపు 45 కోట్ల మందికి రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించారు. 6.8 కోట్ల మంది ప్రజలు అటల్ పెన్షన్ యోజనలో కూడా పాలుపంచుకున్నారు. స్టాండ్ అప్ ఇండియా పథకం కింద రూ.53,609 కోట్ల విలువైన 236,000 రుణాలు ఆమోదించబడ్డాయి. ప్రధాన మంత్రి స్వనిధి పథకం ద్వారా 65 లక్షల మంది వీధి వ్యాపారులు రూ.12,630 కోట్ల రుణాలు పొందారు.