ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధరలు!
పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించడానికి కిరాయిల్లో మార్పులు చేయడం తప్పనిసరి. కస్టమర్లపై పడే భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో ఇంధన ఛార్జీల రూపంలో సాపేక్షంగా తక్కువ మొత్తాన్నే అమలు చేస్తోంది అని తెలిపింది.
- Author : Gopichand
Date : 13-03-2026 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
IndiGo: మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన టికెట్ల ధరల పెంపును ప్రకటించింది. యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు 85 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. మార్చి 14, 2026 నుండి అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన ఛార్జీని (Fuel Charge) విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఛార్జీ ఈరోజు అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుండి అమలులోకి వస్తుంది. అన్ని కొత్త బుకింగ్లకు వర్తిస్తుంది. విమాన టికెట్ల ధరలను రూ. 425 నుండి రూ. 2300 వరకు పెంచారు.
కిరాయి ఎంత పెరిగింది?
మార్చి 14, 2026 నుండి భారత దేశం లోపల విమాన ప్రయాణాలకు రూ. 425 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. భారత ఉపఖండ దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు కూడా ఇంధన ఛార్జీగా రూ. 425 వసూలు చేస్తారు. మిడిల్ ఈస్ట్ ప్రయాణానికి రూ. 900, ఆగ్నేయాసియా, చైనా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ప్రయాణాలకు రూ. 1800 పెంచారు. యూరప్ ప్రయాణానికి అత్యధికంగా రూ. 2300 పెంచారు.
Also Read: పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?
విమానయాన సంస్థ ఏమన్నది?
మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ATF ధరల్లో భారీ పెరుగుదల కనిపించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండిగో తెలిపింది. IATA ‘Jet Fuel Monitor’ కూడా దీనిని ధృవీకరించింది. ATF అనేది తమ కార్యకలాపాలలో అతిపెద్ద వ్యయమని (Cost), ఈ ఆకస్మిక పెరుగుదల ప్రభావం మొత్తం నెట్వర్క్పై పడుతోందని ఎయిర్లైన్ పేర్కొంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా టికెట్లపై ఫ్యూయల్ సర్ ఛార్జీని విధిస్తున్నట్లు ప్రకటించాయి.
కంపెనీ మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించడానికి కిరాయిల్లో మార్పులు చేయడం తప్పనిసరి. కస్టమర్లపై పడే భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో ఇంధన ఛార్జీల రూపంలో సాపేక్షంగా తక్కువ మొత్తాన్నే అమలు చేస్తోంది అని తెలిపింది.