HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Income Tax Exemption Limit Raised

Income Tax Exemption: ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారా? నిపుణుల అభిప్రాయం ఇదే!

పాత పన్ను స్కీమ్ మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంపై ఆర్థిక మంత్రి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని గార్గ్ అన్నారు.

  • By Gopichand Published Date - 10:38 AM, Thu - 30 January 25
  • daily-hunt
No Income Tax
No Income Tax

Income Tax Exemption: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇటువంటి పరిస్థితిలో అన్ని వాటాదారులు, పన్ను చెల్లింపుదారుల (Income Tax Exemption) పెరుగుతున్న అంచనాలను ఎలా పరిష్కరించాలనేది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెద్ద సవాలు. ఇటువంటి పరిస్థితిలో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనాన్ని అందిస్తూ, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తూ సమతుల్యతను కొనసాగించే అటువంటి బడ్జెట్‌ను రూపొందించాలి. ఈ అంచనాలను పరిష్కరించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళిక అవసరమ‌ని నిపుణులు చెబుతున్నారు.

పాత, కొత్త పన్ను విధానం మధ్య వ్యత్యాసం

పాత పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల వరకు ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 5% చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ. 10 లక్షల వరకు ఉన్నవారు 20%, రూ. 10 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాలి.

కొత్త పన్ను శ్లాబ్ గురించి మాట్లాడుకుంటే.. దీని కింద రూ. 3 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను లేదు. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య వార్షిక వేతనంపై 5% పన్ను క‌ట్టాల్సి ఉంటుంది. మీ ఆదాయం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలు ఉంటే మీరు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వ్యక్తి 15 శాతం, రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు ఆర్జించే వ్యక్తి 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు 25% చొప్పున పన్ను చెల్లించాలి. 2020లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. దీని కింద పన్ను చెల్లింపుదారులకు పాత లేదా కొత్త పన్ను విధానం ఎంచుకునే అవకాశం ఇచ్చారు.

Also Read: Cool Drinks Side Effects: కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తాగుతున్నారా? అయితే మీకు స‌మ‌స్య‌లే!

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి

పాత విధానాన్ని కొనసాగించే అవకాశంతో ఆర్థిక మంత్రి సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్ట‌డంతో అది కష్టాలను మరింత పెంచింది. దీనిపై భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తాజాగా మాట్లాడుతూ.. పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని అన్నారు. 25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30% గరిష్ట పన్ను రేటు వర్తిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇదే జరిగితే రూ.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

పాత పన్ను స్కీమ్ మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంపై ఆర్థిక మంత్రి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని గార్గ్ అన్నారు. తన డిమాండ్ వెనుక కారణాన్ని వివరిస్తూ గత దశాబ్దంలో ద్రవ్యోల్బణం రేటు 100 శాతానికి పైగా పెరిగిందని చెప్పారు. ప్రస్తుత మినహాయింపు పరిమితి వాడుకలో లేదని, పన్ను చెల్లింపుదారులపై చాలా భారం పడుతోందని కూడా అన్నారు.

10 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేశారు

భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు పన్ను రిటర్నులు దాఖలు చేశారని, అయితే వారిలో దాదాపు 7 కోట్ల మంది ప్రభుత్వం మినహాయింపు నిబంధన కారణంగా పన్నులు చెల్లించడం లేదని గార్గ్ చెప్పారు. అదేవిధంగా భారతదేశంలో దాదాపు 3 కోట్ల మంది ప్రజలు మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారన్నారు. వారిలో ఎక్కువ మంది (సుమారు 95 శాతం) జీతాలు తీసుకుంటున్నవారే ఉన్నార‌ని పేర్కొన్నారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Budget 2025
  • Budget News
  • income tax
  • Income Tax Exemption
  • nirmala sitharaman
  • pm modi
  • union budget

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

  • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

  • Air China Flight : విమానంలో మంటలు

  • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd