కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు
సాధారణంగా బడ్జెట్ రోజున మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతాయి, కానీ ఈసారి పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్టాల నుంచి భారీ కరెక్షన్కు గురవ్వడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆదివారం
- Author : Sudheer
Date : 01-02-2026 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
Gold & Silver Price : భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కనీవినీ ఎరుగని రీతిలో కుప్పకూలుతున్నాయి. సాధారణంగా బడ్జెట్ రోజున మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతాయి, కానీ ఈసారి పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్టాల నుంచి భారీ కరెక్షన్కు గురవ్వడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆదివారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాల్లో మార్పులు మరియు డాలర్ ఇండెక్స్ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పతనం, దేశీయ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
వెండిలో ‘లోయర్ సర్క్యూట్’ – మార్కెట్ క్రాష్
వెండి ధరలో వచ్చిన పతనం అత్యంత భీతిని కలిగిస్తోంది. శనివారం నాటి క్లోజింగ్ ధరతో పోలిస్తే, ఆదివారం మార్కెట్ ప్రారంభంలోనే కిలో వెండిపై రూ. 26,273 భారీ పతనం నమోదైంది. ఒక దశలో కిలో వెండి ధర రూ. 2,73,500 స్థాయికి దిగజారింది. మార్కెట్లో నిరంతరాయంగా అమ్మకాలు కొనసాగడంతో వెండి ధర ‘లోయర్ సర్క్యూట్’ను తాకింది. వరుసగా రెండో రోజు కూడా ధరలు పుంజుకోలేకపోవడంతో, మున్ముందు ఈ పతనం మరింత కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Silver runs surpassing gold
గోల్డ్ లోన్ కంపెనీల షేర్లు విలవిల
బంగారం ధర పతనం ప్రభావం కేవలం ఆభరణాల రంగానికే పరిమితం కాకుండా, ఆర్థిక రంగానికి కూడా పాకింది. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,000 స్థాయికి పడిపోవడంతో, బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలైన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ వంటి సంస్థల షేర్లు సుమారు 10 శాతం మేర క్షీణించాయి. అలాగే మెటల్ దిగ్గజాలైన హిందుస్థాన్ జింక్ మరియు వేదాంత షేర్లలో కూడా భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో దిగుమతి సుంకాలపై చేసే ప్రకటనలు ఈ ధరల గమనాన్ని నిర్దేశించనున్నాయి.