HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Business
  • >Farmers Urge Finance Minister To Enhance Pm Kisan Nidhi To %e2%82%b912000

PM Kisan Nidhi: రైతులకు శుభ‌వార్త చెప్ప‌నున్న ప్రధాని మోదీ.. రూ. 6 వేల నుంచి రూ. 12 వేల‌కు!

పీఎం కిసాన్‌ నిధి కింద రైతులకు ఇచ్చే సాయం మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా రైతుల ప్రతినిధులు కూడా బడ్జెట్‌కు ముందు సమావేశంలో ఆర్థిక మంత్రి ముందు ఇదే డిమాండ్‌ చేశారు.

  • By Gopichand Published Date - 10:10 AM, Wed - 18 December 24
  • daily-hunt
PM-KISAN 19th Installment
PM-KISAN 19th Installment

PM Kisan Nidhi: కొనసాగుతున్న రైతుల ఆందోళనల మధ్య ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM Kisan Nidhi) పరిమితిని ఏటా రూ.6000 నుంచి రూ.12000కు పెంచాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ కమిటీ చైర్మన్ చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది.

పీఎం కిసాన్ ఫండ్‌ను రూ.12000కి పెంచాలని సిఫార్సు

మంగళవారం.. 17 డిసెంబర్ 2024న చరణ్‌జిత్ సింగ్ చన్నీ లోక్‌సభలో వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించి 18వ లోక్‌సభ గ్రాంట్ల కోసం మొదటి డిమాండ్‌ను సమర్పించారు. ఈ నివేదికలో వ్యవసాయ సంక్షేమ మంత్రిత్వ శాఖతో అనుబంధించబడిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఇచ్చే మొత్తం పరిమితిని రెట్టింపు చేయాలని సిఫార్సు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే మొత్తం పరిమితిని ఏటా రూ.6000 నుంచి రూ.12000కు పెంచాలని కమిటీ సిఫార్సు చేస్తుందని నివేదిక పేర్కొంది.

Also Read: Diabetic Retinopathy : పెరుగుతున్న డయాబెటిక్‌ రెటీనోపతి కేసులు.. ఏమిటీ వ్యాధి ?

బడ్జెట్‌లో రైతులకు కానుక!

పీఎం కిసాన్‌ నిధి కింద రైతులకు ఇచ్చే సాయం మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా రైతుల ప్రతినిధులు కూడా బడ్జెట్‌కు ముందు సమావేశంలో ఆర్థిక మంత్రి ముందు ఇదే డిమాండ్‌ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటరీ కమిటీ నుండి అందిన సిఫార్సుల ఆధారంగా.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తం పరిమితిని పెంచడం బడ్జెట్‌లో ప్రకటించబడుతుందని ఊహాగానాలు వ‌స్తున్నాయి.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచుతారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1, 2019న సమర్పించిన బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పీఎం కిసాన్ యోజన కింద చిన్న, మధ్య తరహా రైతులకు మూడు విడతలుగా ఏటా రూ.6000 అందజేస్తారు. ఈ పథకం కింద నేరుగా నగదు బదిలీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. ఇప్పటి వరకు 18 విడతల్లో రూ.3.45 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • Charanjit Singh Channi
  • nirmala sitharaman
  • Pm Kisan Samman Nidhi Yojana
  • PM Kisan Samman Yojana
  • PM Kisan Yojana
  • pm modi
  • Union Budget 2025

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Trade War

    Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Gst 2.0

    GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd