HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Budget 2025 No Tax Payable Upto Rs 12l New Slabs Introduced

Budget 2025: రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్‌.. అలాంటప్పుడు రూ.8-12 లక్షలపై 10% ఎందుకు?

బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మీరు దీని పైన ఒక్క రూపాయి అయినా సంపాదిస్తే మీరు నేరుగా 15% పన్ను వర్గంలోకి వస్తారు.

  • Author : Gopichand Date : 01-02-2025 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Budget 2025
Budget 2025

Budget 2025: సాధారణ బడ్జెట్‌లో (Budget 2025) ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ ప్రకటన వెలువడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 12 లక్షల వరకు ఆదాయానికి ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించారు. అయితే దీని ప్రయోజనం కొత్త పన్ను విధానాన్ని అనుసరించే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఉపశమన ప్రకటనకు సంబంధించి ప్రజల్లో కొంత గందరగోళం ఉంది. ఎందుకంటే పన్ను స్లాబ్ రూ. 8 నుండి 12 లక్షల మధ్య ఆదాయంపై 10% పన్నును చూపుతుంది. రూ. 12 లక్షల ఆదాయం పన్ను రహితంగా ఎలా మారింది అనే ప్రశ్న అంద‌రిలోనూ వ‌స్తోంది.

ఈ విధంగా డిస్కౌంట్ పొందుతారు

బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మీరు దీని పైన ఒక్క రూపాయి అయినా సంపాదిస్తే మీరు నేరుగా 15% పన్ను వర్గంలోకి వస్తారు. మీ ఆదాయం రూ. 12 లక్షలపై ప్రభుత్వం పన్నుపై రాయితీ ఇస్తోంది.. కాబట్టి మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రస్తుత విధానంలో రూ.0 నుంచి రూ.4 లక్షల వరకు పన్ను సున్నా. రూ.4 నుంచి 8 లక్షలపై 5%, రూ.8 నుంచి 12 లక్షలపై 10%. 87A కింద ప్రభుత్వం రెండవ, మూడవ స్లాబ్ పన్నును మాఫీ చేస్తుంది. ఈ విధంగా మీ ఆదాయం రూ. 12 లక్షల వరకు పన్ను రహితంగా ఉంటుంది. ప్రభుత్వం సెక్షన్ 87Aని సవరించింది. దీని ప్రకారం ప్రత్యేక రాయితీ ద్వారా రూ. 12 లక్షల వరకు ఆదాయం పన్ను నుండి మినహాయించారు.

రాయితీ ఇలా ఇస్తారు

ప్రభుత్వం రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితం చేసినందున, అంతకంటే తక్కువ ఆదాయంపై కూడా పన్ను లెక్కింపులో మార్పు ఉంటుంది. ఉదాహరణకు, రూ. 8 లక్షల ఆదాయం 5% పన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో రూ.4 లక్షలకు ఇప్పటికే పన్ను మినహాయింపు ఉంది. మిగిలిన రూ.4 లక్షలపై చెల్లించాల్సిన పన్ను సెక్షన్ 87ఏ కింద రాయితీ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండ‌దు.

Also Read: Delhi vs Railways: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ.. రైల్వేస్‌ ఇన్నింగ్స్ తేడాతో చిత్తు!

ఉద్యోగస్తులకు మరిన్ని ప్రయోజనాలు

స్టాండర్డ్ డిడక్షన్‌తో సహా రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఉద్యోగులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని, పన్ను నిబంధనలను సరళీకృతం చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు.

ఎవరిపై ఎంత పన్ను విధిస్తారు?

మీ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు రూ. 12 నుంచి 16 లక్షల 15% పన్ను శ్లాబ్‌లోకి వస్తారు. ఈ విధంగా మీ పన్ను దాదాపు రూ.1.20 లక్షలు అవుతుంది. ఏటా రూ.16-20 లక్షలు సంపాదించే వారు రూ.2 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.20 నుంచి 24 లక్షల ఆదాయం ఉన్నవారు రూ.3 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ.24 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త పన్ను విధానం- పన్ను స్లాబ్‌లు

  • 12 లక్షల ఆదాయంపై పన్ను లేదు.
  • 0 నుండి 4 లక్షల ఆదాయంపై జీరో పన్ను.
  • 4 నుంచి 8 లక్షల ఆదాయంపై 5% పన్ను.
  • 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 10% పన్ను.
  • 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15% పన్ను.
  • 16 నుంచి 20 లక్షల ఆదాయంపై 20% పన్ను.
  • 20 నుంచి 24 లక్షల ఆదాయంపై 25% పన్ను.
  • 24 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30% పన్ను.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Budget 2025
  • Budget News
  • nirmala sitharaman
  • pm modi
  • RS 12 Lakhs
  • tax
  • Union Budget 2025

Related News

President Trump

President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

టీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్‌పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు.

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd