Budget 2025: రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్.. అలాంటప్పుడు రూ.8-12 లక్షలపై 10% ఎందుకు?
బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మీరు దీని పైన ఒక్క రూపాయి అయినా సంపాదిస్తే మీరు నేరుగా 15% పన్ను వర్గంలోకి వస్తారు.
- By Gopichand Published Date - 04:55 PM, Sat - 1 February 25

Budget 2025: సాధారణ బడ్జెట్లో (Budget 2025) ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ ప్రకటన వెలువడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని పార్లమెంట్లో ప్రకటించారు. అయితే దీని ప్రయోజనం కొత్త పన్ను విధానాన్ని అనుసరించే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఉపశమన ప్రకటనకు సంబంధించి ప్రజల్లో కొంత గందరగోళం ఉంది. ఎందుకంటే పన్ను స్లాబ్ రూ. 8 నుండి 12 లక్షల మధ్య ఆదాయంపై 10% పన్నును చూపుతుంది. రూ. 12 లక్షల ఆదాయం పన్ను రహితంగా ఎలా మారింది అనే ప్రశ్న అందరిలోనూ వస్తోంది.
ఈ విధంగా డిస్కౌంట్ పొందుతారు
బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మీరు దీని పైన ఒక్క రూపాయి అయినా సంపాదిస్తే మీరు నేరుగా 15% పన్ను వర్గంలోకి వస్తారు. మీ ఆదాయం రూ. 12 లక్షలపై ప్రభుత్వం పన్నుపై రాయితీ ఇస్తోంది.. కాబట్టి మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రస్తుత విధానంలో రూ.0 నుంచి రూ.4 లక్షల వరకు పన్ను సున్నా. రూ.4 నుంచి 8 లక్షలపై 5%, రూ.8 నుంచి 12 లక్షలపై 10%. 87A కింద ప్రభుత్వం రెండవ, మూడవ స్లాబ్ పన్నును మాఫీ చేస్తుంది. ఈ విధంగా మీ ఆదాయం రూ. 12 లక్షల వరకు పన్ను రహితంగా ఉంటుంది. ప్రభుత్వం సెక్షన్ 87Aని సవరించింది. దీని ప్రకారం ప్రత్యేక రాయితీ ద్వారా రూ. 12 లక్షల వరకు ఆదాయం పన్ను నుండి మినహాయించారు.
రాయితీ ఇలా ఇస్తారు
ప్రభుత్వం రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితం చేసినందున, అంతకంటే తక్కువ ఆదాయంపై కూడా పన్ను లెక్కింపులో మార్పు ఉంటుంది. ఉదాహరణకు, రూ. 8 లక్షల ఆదాయం 5% పన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో రూ.4 లక్షలకు ఇప్పటికే పన్ను మినహాయింపు ఉంది. మిగిలిన రూ.4 లక్షలపై చెల్లించాల్సిన పన్ను సెక్షన్ 87ఏ కింద రాయితీ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Also Read: Delhi vs Railways: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ.. రైల్వేస్ ఇన్నింగ్స్ తేడాతో చిత్తు!
ఉద్యోగస్తులకు మరిన్ని ప్రయోజనాలు
స్టాండర్డ్ డిడక్షన్తో సహా రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఉద్యోగులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని, పన్ను నిబంధనలను సరళీకృతం చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు.
ఎవరిపై ఎంత పన్ను విధిస్తారు?
మీ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు రూ. 12 నుంచి 16 లక్షల 15% పన్ను శ్లాబ్లోకి వస్తారు. ఈ విధంగా మీ పన్ను దాదాపు రూ.1.20 లక్షలు అవుతుంది. ఏటా రూ.16-20 లక్షలు సంపాదించే వారు రూ.2 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.20 నుంచి 24 లక్షల ఆదాయం ఉన్నవారు రూ.3 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ.24 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త పన్ను విధానం- పన్ను స్లాబ్లు
- 12 లక్షల ఆదాయంపై పన్ను లేదు.
- 0 నుండి 4 లక్షల ఆదాయంపై జీరో పన్ను.
- 4 నుంచి 8 లక్షల ఆదాయంపై 5% పన్ను.
- 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 10% పన్ను.
- 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15% పన్ను.
- 16 నుంచి 20 లక్షల ఆదాయంపై 20% పన్ను.
- 20 నుంచి 24 లక్షల ఆదాయంపై 25% పన్ను.
- 24 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30% పన్ను.