AP GOVT : నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు…1,64,155మందికి ఉద్యోగాలు..!!
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. అచ్యుతాపురం సెజ్ లో టైర్ల కంపెనీని ప్రారంభించిన జగన్ ...ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
- By hashtagu Published Date - 03:48 PM, Tue - 16 August 22

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. అచ్యుతాపురం సెజ్ లో టైర్ల కంపెనీని ప్రారంభించిన జగన్ …ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. దేవుడి దయ, అండతో ఒక పరిశ్రమ నేడు ప్రారంభం అయ్యింది. రెండ ఫేజ్ పనులకు కూడా శంకుస్థాపన చేశామన్నారు. యొకహోమా కంపెనీ ప్రపంచంలోనే 5,,6 స్థానాల్లో ఉంది. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం హర్షించదగ్గ విషయమని వెల్లడించారు.
రానున్న రోజుల్లో మరో 56 అతిభారీ, భారీ పరిశ్రమలు రూ. 1,54,000పెట్టుబడితో ఏర్పాటు అవుతాయని వివరించారు. దీనిద్వారా 1,64, 155 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయి…ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నెంబర్ వన్ గా గత మూడేండ్లుగా అవార్డులు తీసుకుంటున్నామని తెలిపారు.
మొదటిసారిగా ఈ సారి సర్టిఫికేషన్ చేయడానికి దాని తీరును కూడా మార్చారని…ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆ విధంగా రూల్స్ మార్చడంతో వరుసగా 3ఏళ్లుగా ఏపీ నెంబర్ వన్ ర్యాంకు సాధిస్తోందని జగన్ తెలిపారు. ప్రతి అడుగులో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.