Aqua Farmers: ఆక్వా రైతులకు వరంగా మారిన యువ ప్రొఫెసర్ ఆవిష్కరణ
- By HashtagU Desk Published Date - 06:41 PM, Sun - 27 February 22

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవిష్కరణ ఆక్వా రైతులకు వరంగా మారింది. గుంటూరులోని నంబూరు గ్రామానికి చెందిన మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కనిపెట్టిన చైన్ డ్రాగింగ్ బోట్ను గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, తీరప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సెమినార్లో యువ ప్రొఫెసర్ మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కు ఈ ఆలోచన వచ్చింది. అక్కడ అతను రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నాడు.
ఆక్వా ఫార్మింగ్లో చేపలు లేదా రొయ్యల చెరువును సిద్ధం చేస్తున్నప్పుడు, చెరువును 80 నుండి 100 సెం.మీ లోతు వరకు నింపి, ప్రోబయోటిక్స్ తో ఏడు రోజుల పాటు గొలుసు లాగుతారు. నేల మిశ్రమాన్ని మెరుగుపరచడానికి బయోఫిల్మ్ల అభివృద్ధిని తగ్గించడానికి సున్నితంగా లాగడం జరుగుతుంది. ఇది రైతులకు దాదాపు రెండు నెలలు పట్టవచ్చు. ఈ ప్రక్రియలో అధిక ఖర్చు అవుతుంది. ఈ ప్రక్రియలో ఖర్చును తగ్గించేందుకు తౌసీఫ్ అహ్మద్ చైన్ డ్రాగింగ్ బోట్ను తయారు చేశాడు.
మాన్యువల్ చైన్ డ్రాగింగ్కు బదులుగా ఈ మెకనైజ్డ్ చైన్ డ్రాగింగ్ బోట్ ఒక్క ఆపరేటర్తో రోజుకు 10 నుండి 20 చెరువులను పూర్తి చేస్తుంది.ఈ బోట్ స్టీల్ ఫ్రేమ్, డ్రైవర్ కోసం ఒక సీటును ఉంటుందని అహ్మద్ తెలిపారు. పడవను నడపడానికి షాఫ్ట్, పెల్లర్తో కూడిన ఇంజిన్ ఉపయోగించబడుతుందని..మూడున్నర-లీటర్ల ఇంధన నిల్వ ట్యాంక్తో కూడిన బోట్ కోసం 4.5HP, 6,500 RPM కలిగిన GX160 ఇంజన్ ఉపయోగించబడిందన్నారు. డ్రాగింగ్ బోట్ తయారీ కోసం మొదట్లో నిధుల కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు.
ఆ తరువాత ఎలాగోలా ప్రాజెక్టును పూర్తి చేశానని.. రైతులు మొదటి సారి పడవను ఉపయోగించినప్పుడు వారి ముఖంలో సంతోషాన్ని చూస్తే ఎంతో అనందం కలిగిందని అహ్మద్ తెలిపారు. తాను 2021లో దాని కోసం పేటెంట్ పొందానని తెలిపారు. హైదరాబాద్లో బీటెక్, ఎంటెక్ చదివిన అహ్మద్ 2012లో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు.ఈయన కర్మశక్తి ఎన్జీవో ద్వారా ద్వారా ఉత్తమ TPO (అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు శిక్షణ మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్)గా బంగారు పతకాన్ని అందుకున్నాడు. దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన ఉపాధ్యాయులను గౌరవించే దేశవ్యాప్త చొరవ అయిన iB హబ్స్ సూపర్ 30కి నామినేట్ అయ్యారు.