New Party: కొత్త పార్టీకి ‘కాపు’పునాది?
నిక్కార్సైన కాపుల పార్టీ ఏపీలో రాబోతుందని ప్రచారం ఊపందుకుంది.
- By CS Rao Published Date - 06:12 PM, Sun - 23 October 22
నిక్కార్సైన కాపుల పార్టీ ఏపీలో రాబోతుందని ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పలు మార్లు సమావేశం అయిన ఆ సామాజిక వర్గం నేతలు బీసీ, కాపు కాంబినేషన్ లో పార్టీ పెట్టాలని అనుకున్నారు. కానీ, పవన్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని తొలుత భావించి ఇప్పుడు పార్టీ పెట్టుకోవాలని నిర్ణయం తీసున్నారట. జనసేనాని నిజమైన కాపు కాదంటూ ఇటీవల పరోక్షంగా మాజీ మంత్రి నాని వ్యాఖ్యానించిన విషయం విదితమే. పైగా పవన్ టీడీపి తో కలసి వెళ్తున్నాడని భావించిన సిసలైన కాపులుగా ఫోకస్ అవుతూ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్. చివరి ఆప్షన్ గా ఈ టీంకు బీఆర్ఎస్ కనిపిస్తుందని చెబుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కేంద్రంగా త్వరలో కాపు సామాజిక వర్గ శ్రేయస్సే లక్ష్యంగా ఓ రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతున్నదని తెలుస్తోంది.. టీడీపీ మాజీ ఎంపీ, దివంగత మెంటే పద్మనాభం అల్లుడు, న్యాయవాది ఆరేటి ప్రకాష్ ఈ దిశగా సన్నాహాలు ప్రారంభించినట్టు సమాచారం. టీడీపీ హయాంలో ఉధృతం గా నడిచిన కాపు ఉద్యమానికి ప్రధాన కారకులలో ఆరేటి ప్రకాష్ ఒకరు. ఈ ఉద్యమం లోకి ముద్రగడ పద్మనాభం ను తీసుకురావడానికి ఆయన విశేష కృషి చేశారని సర్వత్రా తెలుసు.
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ సాధించలేకపోయామనే అసంతృప్తి ప్రకాష్ కు ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ కాపులకు న్యాయం జరగడం లేదన్న అసహనంలో ప్రకాష్ ఉన్నారట. కాపులలో ప్రముఖులైన కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ డీజీపీ సాంబశివరావు, ఐఏఎస్ మాజీ అధికారి చంద్రశేఖర్ తదితరులను ఒకే చోటకు చేర్చి, కాపు సామాజిక శ్రేయస్సు కు సంబంధించిన అంశాల పై ఉద్యమించాలని విస్తృతంగా చర్చించారు.
వీళ్ళందరూ ఒక చోట కలవడానికి ఆరేటి ప్రకాష్ సంధాన కర్త గా పనిచేశారు. కానీ, ఈ సమావేశాలు ఎటువంటి కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో, ఒక రాజకీయ పార్టీ స్థాపన అనివార్యమని ఆయన భావిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేదని, కాపుల సామాజికాభివృద్ధికి ఎవరు మద్దతు ఇస్తే వాళ్లకు అనుకూలంగా కాపులలో ప్రచారం చేస్తామని ఆరేటి ప్రకాష్ చెప్పారు. ఇదే సమయంలో పార్టీ పెట్టడంపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం