HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Wild Cows Attack Threat To Farm Lands In Ntr And Palnadu Districts

Wild Cows Attack: అడవి ఆవుల ఎటాక్.. ఎందుకు ? ఏమిటి ?

ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అడవి ఆవులు(Wild Cows Attack) ఎక్కడివి ? అంటే.. వీటిని 50 ఏళ్ల క్రితం కృష్ణా నది అడవి లంక భూముల్లో స్థానికులే వదిలారు.

  • Author : Pasha Date : 19-04-2025 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Wild Cows Attack Farm Lands Ntr District Palnadu District Andhra Pradesh

Wild Cows Attack: పంటలపై ఏనుగులు, అడవి పందులు దాడి చేసిన ఘటనల గురించి మనం విన్నాం.  ఇప్పుడు ఈ లిస్టులో అడవి ఆవులు కూడా చేరిపోయాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఉన్న కృష్ణాతీర లంక భూముల్లోని పొలాలపై దాడికి దిగుతున్నాయి. వాటిని తోలేందుకు ప్రయత్నించే రైతులపై దాడికి దిగుతున్నాయి. ఇంతకీ ఎందుకీ సమస్య తలెత్తింది ? అడవి ఆవులు ఎక్కడివి ?

Also Read :Central Intelligence: ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులపై ‘‘నిఘా’’.. ఎందుకు ?

అడవి ఆవులు ఎక్కడివి ?  

ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అడవి ఆవులు(Wild Cows Attack) ఎక్కడివి ? అంటే.. వీటిని 50 ఏళ్ల క్రితం కృష్ణా నది అడవి లంక భూముల్లో స్థానికులే వదిలారు. ఏళ్లు గడిచిన కొద్దీ వీటి సంతతి పెరిగింది. వీటి సంఖ్య వేల స్థాయికి చేరింది. లంక భూముల అడవుల్లో ఇవి జీవించసాగాయి. అయితే లంక భూముల్లో అడవి ఆవులకు మేత సరిపోవడం లేదు.  అందుకే అవన్నీ గుంపులుగా వచ్చి సమీపంలోని  పంట పొలాలపై పడుతున్నాయి. ఒక్కో గుంపులో దాదాపు 200కుపైనే ఆవులు ఉంటాయి. అవన్నీ కలిసి పంటలను నాశనం చేస్తున్నాయి. అడవి ఆవులు పెద్దసంఖ్యలో ఉండటంతో రైతులు వాటిని అడ్డుకోలేకపోతున్నారు.ఒకవేళ తరిమే యత్నం చేస్తే.. పొడిచేందుకు పైకి దూసుకొస్తున్నాయి.

Also Read :Sourav Ganguly: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. ఉపాధ్యాయుల‌కు సౌర‌బ్‌ గంగూలీ విజ్ఞ‌ప్తి

నందిగామ ఎమ్మెల్యే సౌమ్య చొరవతో.. 

అడవి ఆవుల వల్ల జరుగుతున్న పంటనష్టాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని చందర్లపాడు ప్రాంత రైతులు నందిగామ ఎమ్మెల్యే సౌమ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈవిషయాన్ని ఆమె ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ స్వయంగా వెళ్లి ఆవుల మందలను డ్రోన్‌‌తో వీడియోలు తీయించారు. వాటి నుంచి పంటలను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నారు.

పొలాలపై అడవి ఆవుల దాడి.. ఎందుకు ? 

పుట్టినప్పటి నుంచి మనుషులకు దూరంగా ఉండటం వల్ల..  అడవి ఆవులకు ఇలాంటి దూకుడు స్వభావం వస్తుంది. కొన్నేళ్ల కిందటి వరకు ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు, పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట మండల పరిధిలోని తీర గ్రామాల లంకభూముల్లో ఏడాదంతా  పచ్చగడ్డి ఉండేది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో పులిచింతల దిగువ నుంచి ప్రకాశం బ్యారేజి ఎగువ వరకు ఒకప్పుడు వందలు, వేల ఎకరాల్లో లంక భూములు ఉండేవి. అయితే గత నాలుగేళ్లుగా ఆ భూముల్లో ఆవులకు మేత కరువైంది. దీంతో ఆకలికి తట్టుకోలేక అడవి ఆవులు సుబాబుల్, జామాయిల్‌ చెట్ల బెరడునూ తింటున్నాయి. చివరకు మేత కోసం సమీపంలోని పొలాల్లోకి వస్తున్నాయి. పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి.

అడవి ఆవులను ఏం చేయబోతున్నారంటే.. 

అటవీశాఖ సహకారంతో ఆవులను పట్టి, తెచ్చి గోశాలకు తరలించాలని అధికారులు యోచిస్తున్నారు. అడవి ఆవుల కోసం గోశాలను ఏర్పాటు చేసేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. గంగిరెద్దులను ఆడించే కుటుంబాల వారితో వాటికి శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. తద్వారా అడవి ఆవులను పెంపుడు ఆవుల్లా మచ్చిక చేస్తారు. తర్వాత వాటిని రైతులకు అప్పగిస్తారు.  అడవి ఆవుల్లో అరుదైన ఒంగోలు జాతి ఆబోతులు, ఆవులు, దూడలు ఉన్నాయి. ఒక్కో ఆబోతు ధర రూ.10లక్షలకుపైనే ఉంటుందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Farm Lands
  • ntr district
  • Palnadu District
  • Wild Cows
  • Wild Cows Attack

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd