Fee Reimbursement : దశలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం – మంత్రి లోకేష్
Fee Reimbursement : గత ప్రభుత్వ హయాంలో పీజీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ తొలగించబడిన నేపథ్యంలో, తిరిగి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు
- Author : Sudheer
Date : 12-03-2025 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్(AP)లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో పీజీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ తొలగించబడిన నేపథ్యంలో, తిరిగి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని సహాయాలు అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Guava Leaves: ఈ ఆకును వారానికి 3 సార్లు నమలండి.. అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు!
ఇటీవల కాలంలో కొన్ని కాలేజీలు విద్యార్థులపై ఫీజు బకాయిలను చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్న ఘటనలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా విద్యను కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఇలాంటి ఒత్తిళ్లకు గురైతే, తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
KTR : ‘చీప్’ మినిస్టర్ త్వరగా కోలుకోవాలంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని దిశగా మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లోకేష్ వెల్లడించారు.