Hijab Issue: బెజవాడ హిజాబ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన ప్రిన్సిపల్
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. తాజగా ఏపీలోని విజయవాడలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది.
- By Hashtag U Published Date - 05:31 PM, Thu - 17 February 22
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. తాజగా ఏపీలోని విజయవాడలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థనులను కాలేజీ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. అయితే తాము ఫస్ట్ ఇయర్ నుంచి హిజాబ్ ధరించి వస్తున్నామని..కాలేజీ ఐడీ కార్డులో కూడా హిజాబ్ ధరించే ఫోటో దిగామని విద్యార్థినులు చెప్తున్నారు. ఈ వివాదంతో కాలేజీ దగ్గరకు పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు చేరుకుంటున్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.
హిజాబ్ ధరించినందుకు ఇద్దరు విద్యార్థులను క్యాంపస్లోకి రానీయకుండా ప్రిన్సిపాల్ కిషోర్ అడ్డుకోవడంతో ఆంధ్రా లయోలా కళాశాల వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే, బాలికల వెయిటింగ్ హాల్లో హిజాబ్ను తొలగించిన తర్వాత కాలేజీ యూనిఫాంతో తరగతులకు హాజరు కావాలని ఇద్దరిని మాత్రమే తాను కోరానని ఇది కళాశాల్లో ఉన్న నిబంధనలు అని ఆయన తెలిపారు. కళాశాలలో చివరి సంవత్సరం బీఎస్సీ కోర్సు చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పటాన్ సాదికున్నీసా, షేక్ రేష్మాని హిజాబ్ తొలగించి క్యాంపస్లోకి ప్రవేశించమని ఆదేశించడంతో సమస్య ప్రారంభమైంది. ఈ వార్త తెలియగానే, క్యాంపస్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. హిజాబ్ ధరించి క్యాంపస్లోకి రాకుండా అడ్డుకోవడంతో తన కూతురు నుంచి కాల్ వచ్చిందని సాదికున్నీసా కుటుంబ సభ్యులు తెలిపారు. “ఇది మా గౌరవం, హక్కులు, సంప్రదాయానికి సంబంధించినది, ఆమె మొదటి సంవత్సరం నుండి హిజాబ్ ధరించి కళాశాలలో చదువుతోంది. దానిని ధరించి క్యాంపస్లోకి ప్రవేశించకుండా కాలేజీ యాజమాన్యం ఇప్పుడు ఎలా అడ్డుకుంటుంది” అని ఆమె కుటుంబసభ్యులు ప్రశ్నించారు.
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ కిషోర్ స్పందిస్తూ, బాలికల వెయిటింగ్ హాల్లో హిజాబ్ తొలగించిన తర్వాత కాలేజీ యూనిఫామ్తో తరగతులకు హాజరు కావాలని ఇద్దరు బాలికలను కోరినట్లు చెప్పారు. అయితే కళాశాలలో చేరిన మొదటి సంవత్సరం నుంచి హిజాబ్ ధరించి కళాశాలకు హాజరవుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పడంతో, జిల్లా కలెక్టర్ జె నివాస్, నగర పోలీసు కమిషనర్ క్రాంతి రాణా టాటాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత కిషోర్ సంఘటనపై క్షమాపణలు చెప్పారు. అనంతరం విద్యార్థులను హిజాబ్తో తరగతుల్లోకి అనుమతించారు.
Related News
PM Modi Mega Roadshow In VJD : వైసీపీకి దడ పుట్టించిన మోడీ రోడ్ షో…
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు