2 Fishes – 4 Lakhs : 2 చేపలకు రూ.4 లక్షల ధర.. ఎందుకో తెలుసా ?
2 Fishes - 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి.
- By Pasha Published Date - 12:02 PM, Sun - 14 April 24
2 Fishes – 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి. జనం ఎగబడి మరీ వేలం పాడి ఆ చేపలను దక్కించుకున్నారు. ఇంతకీ ఆ చేపల వెరైటీ ఏమిటి ? వాటికి అంత ధర ఎందుకు పలికింది ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో ఉన్న అంతర్వేది సముద్ర తీరంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు రెండు కచ్చిడీ చేపలు దొరికాయి. సముద్రంలో వీటిని పట్టుకొని తీసుకొచ్చిన జాలరులు.. ఈ చేపలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో వేలం వేశారు. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ రెండు చేపలకు ఏకంగా రూ.2 లక్షలు(2 Fishes – 4 Lakhs) చెల్లించి కొన్నాడో ఔత్సాహిక వ్యక్తి.
కచ్చడీ చేపలు
- కచ్చడీ చేపలు చాలా అరుదుగా జాలర్లకు సముద్రంలో చిక్కుతుంటాయి.
- సముద్రపు అడుగు భాగంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.
- కచ్చిడీ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదని.. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది.
- కచ్చిడీ చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్.
- వీటిని కొనేవారు తినడానికన్నా.. వ్యాపారం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు.
- ఈ చేపల పొట్టలో తెల్లటి బ్లాడర్ ఉంటుంది.ఇది అత్యంత విలువైనది.
- దీన్ని జనాలు మింగే మందుల్లో వినియోగిస్తారని చెబుతుంటారు.
Also Read :PM Kisan 17th Installment: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు, ఎప్పుడంటే..?
- పలు మాత్రలకు పైపూతలా ఈ బ్లాడర్ను వినియోగిస్తారు.
- రోగులకు వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు వేసే దారం తయారీలోనూ ఈ చేప బ్లాడర్ను వాడుతారు.
- కచ్చిడీ చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుందని అంటారు.
- పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలోనూ ఈ చేపను ఎక్కువగా వాడుతుంటారు.
- కాస్ట్లీ వైన్స్ తయారీలో కూడా కచ్చిడీ చేపను ఉపయోగిస్తారట.
- వైన్ను క్లీన్ చేసేందుకు ఈ చేప రెక్కలు వాడుతారట.
Also Read :Apsara A Diplomat : ‘అప్సర’ వేషధారణలో ఎవరో తెలుసా ?
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.