HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Two Bulletproof Buses For Cm Ys Jagan

CM Jagan : ప్రజల ప్రాణాల కన్నా..జగన్ కు తన ప్రాణాలే ముఖ్యమా..?

  • Author : Sudheer Date : 26-02-2024 - 2:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Two Bulletproof Buses For C
Two Bulletproof Buses For C

రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి (CM)..ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిన పర్వాలేదు..ముందు తన ప్రాణాలే ముఖ్యం అని వ్యవహరిస్తున్నాడని ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై రాష్ట్ర ప్రజలు, ప్రతి పక్షపార్టీలు మండిపడుతున్నారు. గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో APSRTC ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటుంటే..ఆ డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు డబ్బు లేదు కానీ..భద్రత పేరుతో గాల్లో తిరగడానికి 2 హెలికాప్టర్లను అద్దె కు తీసుకురావడం.. 20 కోట్లతో 2 బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులను (Two Bulletproof Buses) కొనుగోలు చేయడం ఇవే కాక 3 కోట్లతో మరో మూడు వాహనాలు సైతం కొనుగోలు చేయడం ఏంటి అని జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికల హడావిడి మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్న జగన్..త్వరలో పూర్తిస్థాయిలో ప్రతి రోజు అన్ని నియోజకవర్గాల్లో తిరిగేందుకు గాను సిద్ధం అవుతున్నారు. ఇందుకు గాను ప్రజల సొమ్ముతో అద్దెకు 2 హెలికాఫ్టర్లు, 20 కోట్లతో 2 బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులను కొనుగోలు చేసాడు. ఐదేళ్లుగా కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని చెపుతున్న ఆర్టీసీ.. జగన్‌ కోసం ఏకంగా 20 కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను కొనుగోలుచేసింది. ఇవికాక మరో 3 కోట్ల రూపాయలు వెచ్చించి మూడు నాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కూడా కొనుగోలుచేసింది. ఇందులో రెండు నాన్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులు ఆదివారం విజయవాడ చేరుకున్నాయి. మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి. సీఎం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు వీలుగా ప్రజలు టికెట్ల రూపంలో ఆర్టీసీకి చెల్లించిన సొమ్ముతో ఈ బస్సులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వ వర్గాల ఆదేశాలతోనే సీఎం పర్యటనలకు వినియోగించే బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుందని, వీటిని వినియోగించుకున్నందుకు ప్రత్యేక టారీఫ్‌ ఉంటుందని, దాని ప్రకారం సర్కారు ఆర్టీసీకి సొమ్ము చెల్లిస్తుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్‌ బస్సుల్లో ప్రయాణించేది అతికొద్ది దూరమే.ఏదైనా జిల్లాలో సభ ఉంటే హెలికాప్టర్‌లో చేరుకుంటారు.

అక్కడ హెలిప్యాడ్‌ నుంచి సభా వేదిక మధ్య దూరం గరిష్ఠంగా 5 కిలోమీటర్ల లోపే ఉంటుంది.సభాస్థలికి చేరుకొనేందుకు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను వినియోగిస్తారు. అయితే సీఎం హెలిప్యాడ్‌ నుంచి సభా వేదికకు చేరుకునే మార్గమంతా బారికేడ్లు ఏర్పాటుచేసి, పరదాలు కట్టేసి, దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటప్పుడు ఉన్నవి వాడుకోకుండా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో ప్రభుత్వం నడిపిస్తూ వస్తుంది.. ఈ డొక్కు బస్సుల్లో ప్రయాణం అంటే ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన కర్మ వచ్చింది. రన్నింగ్‌లో ఉండగానే స్టీరింగ్‌లు, చక్రాలు, యాక్సిల్స్‌ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం వంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయినాగానీ ప్రభుత్వం ఏనాడూ ప్రజల ప్రాణాల గురించి పట్టించుకున్న పాపన పోలేదు కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టి బస్సులు కొనుగోలు చేయడం ఏంటి వారంతా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని వాపోతున్నారు.

Read Also : TS : రైతు బంధు స్కీమ్‌లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan
  • election campaign
  • Two Bulletproof Buses

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

    Latest News

    • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd