HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Two Bulletproof Buses For Cm Ys Jagan

CM Jagan : ప్రజల ప్రాణాల కన్నా..జగన్ కు తన ప్రాణాలే ముఖ్యమా..?

  • Author : Sudheer Date : 26-02-2024 - 2:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Two Bulletproof Buses For C
Two Bulletproof Buses For C

రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి (CM)..ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిన పర్వాలేదు..ముందు తన ప్రాణాలే ముఖ్యం అని వ్యవహరిస్తున్నాడని ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై రాష్ట్ర ప్రజలు, ప్రతి పక్షపార్టీలు మండిపడుతున్నారు. గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో APSRTC ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటుంటే..ఆ డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు డబ్బు లేదు కానీ..భద్రత పేరుతో గాల్లో తిరగడానికి 2 హెలికాప్టర్లను అద్దె కు తీసుకురావడం.. 20 కోట్లతో 2 బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులను (Two Bulletproof Buses) కొనుగోలు చేయడం ఇవే కాక 3 కోట్లతో మరో మూడు వాహనాలు సైతం కొనుగోలు చేయడం ఏంటి అని జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికల హడావిడి మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్న జగన్..త్వరలో పూర్తిస్థాయిలో ప్రతి రోజు అన్ని నియోజకవర్గాల్లో తిరిగేందుకు గాను సిద్ధం అవుతున్నారు. ఇందుకు గాను ప్రజల సొమ్ముతో అద్దెకు 2 హెలికాఫ్టర్లు, 20 కోట్లతో 2 బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులను కొనుగోలు చేసాడు. ఐదేళ్లుగా కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని చెపుతున్న ఆర్టీసీ.. జగన్‌ కోసం ఏకంగా 20 కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను కొనుగోలుచేసింది. ఇవికాక మరో 3 కోట్ల రూపాయలు వెచ్చించి మూడు నాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కూడా కొనుగోలుచేసింది. ఇందులో రెండు నాన్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులు ఆదివారం విజయవాడ చేరుకున్నాయి. మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి. సీఎం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు వీలుగా ప్రజలు టికెట్ల రూపంలో ఆర్టీసీకి చెల్లించిన సొమ్ముతో ఈ బస్సులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వ వర్గాల ఆదేశాలతోనే సీఎం పర్యటనలకు వినియోగించే బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుందని, వీటిని వినియోగించుకున్నందుకు ప్రత్యేక టారీఫ్‌ ఉంటుందని, దాని ప్రకారం సర్కారు ఆర్టీసీకి సొమ్ము చెల్లిస్తుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్‌ బస్సుల్లో ప్రయాణించేది అతికొద్ది దూరమే.ఏదైనా జిల్లాలో సభ ఉంటే హెలికాప్టర్‌లో చేరుకుంటారు.

అక్కడ హెలిప్యాడ్‌ నుంచి సభా వేదిక మధ్య దూరం గరిష్ఠంగా 5 కిలోమీటర్ల లోపే ఉంటుంది.సభాస్థలికి చేరుకొనేందుకు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను వినియోగిస్తారు. అయితే సీఎం హెలిప్యాడ్‌ నుంచి సభా వేదికకు చేరుకునే మార్గమంతా బారికేడ్లు ఏర్పాటుచేసి, పరదాలు కట్టేసి, దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటప్పుడు ఉన్నవి వాడుకోకుండా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో ప్రభుత్వం నడిపిస్తూ వస్తుంది.. ఈ డొక్కు బస్సుల్లో ప్రయాణం అంటే ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన కర్మ వచ్చింది. రన్నింగ్‌లో ఉండగానే స్టీరింగ్‌లు, చక్రాలు, యాక్సిల్స్‌ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం వంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయినాగానీ ప్రభుత్వం ఏనాడూ ప్రజల ప్రాణాల గురించి పట్టించుకున్న పాపన పోలేదు కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టి బస్సులు కొనుగోలు చేయడం ఏంటి వారంతా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని వాపోతున్నారు.

Read Also : TS : రైతు బంధు స్కీమ్‌లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan
  • election campaign
  • Two Bulletproof Buses

Related News

Kcr Pm 3

కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!

ఏపీ నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి

  • Pulse Polio Programme

    నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

Latest News

  • నీ చరిత్ర ఇది రేవంత్ – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

  • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

  • కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్

  • వాట్సాప్ లో ఫొటోలు డౌన్లోడ్ చేస్తున్నారా ? అయితే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్లే !!!

  • మరోసారి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్

Trending News

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd