HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tuffle Continues Between Ap Highcourt Chief Justice Prashant Kumar And Ap Cm Ys Jagan

Prashant Kumar Vs CM Jagan : ఎన్వీ ర‌మ‌ణ దెబ్బ‌కు ఏపీ సీఎం గిలగిల‌

ఏపీలో న్యాయ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఆధిప‌త్యం చెలాయించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రిగింది.

  • Author : CS Rao Date : 25-04-2022 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Chief Justice
Jagan Chief Justice

ఏపీలో న్యాయ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఆధిప‌త్యం చెలాయించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రిగింది. సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి న్యాయ వ్య‌వ‌స్థపై ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు. తీర్పులు చెప్పిన జ‌డ్జిల‌పై వైసీపీ లీడ‌ర్లు, కొంద‌రు మాజీ మంత్రులు సైతం సోష‌ల్ మీడియా వేదిక‌గా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. దానిపై సీబీఐ విచార‌ణ కూడా జ‌రుగుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర న్యాయ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమ‌వారం సాయంత్రం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు.

విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ భేటీ జరగనుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్, సీఎం జ‌గ‌న్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో కలుసుకున్నా ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రాజ‌ధానుల విష‌యంలో హైకోర్టు తీర్పు జ‌గ‌న్ స‌ర్కార్‌కు చెంప‌పెట్టు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని హైకోర్టు తేల్చేసింది. అంతేకాదు,

డెడ్ లైన్ విధిస్తూ రైతుల‌కు ప్లాట్ల‌ను కేటాయించాల‌ని ఆదేశించింది. ఆ తీర్పుపై కూడా వైసీపీ నేత‌లు ప‌లు విధాలుగా విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలో సుప్రీం కోర్టు కు జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మీద కూడా ఫిర్యాదు చేసిన సంద‌ర్భం ఉంది. ఒక ర‌కంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్య‌క్ష యుద్ధానికి జ‌గ‌న్ దిగారు. కానీ, ఆయ‌న యుద్ధం ప్ర‌భావం న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఏమీ ఉండ‌ద‌ని ఎన్వీ ర‌మ‌ణ సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ అయిన త‌రువాత వైసీపీకి బోధ‌ప‌డింది.

న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ప‌లు మార్పులు తీసుకొస్తూ ఎన్వీ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఆయ‌న స‌మ‌ర్థ‌త‌ను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈనెల 30వ తేదీన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల జ‌డ్జిల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు. ముఖ్య అతిథులుగా ఎన్వీ ర‌మ‌ణ‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల‌తో పాటు దిగువ కోర్టుల్లో ఉన్న స‌మ‌స్య‌లు, ఇత‌రత్రా మౌలిక సదుపాయాల‌పై మాట్లాడ‌తారు. స‌త్వ‌ర న్యాయం కోసం సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డానికి ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఏపీ సీఎం, హైకోర్టు జ‌డ్జి భేటీ అవుతున్నారా? ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించ‌డానికా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హైకోర్టును క‌ర్నూలుకు మార్చాల‌ని ఏపీ స‌ర్కార్ ప్ర‌తిపాద‌న ఉంది. అందుకోసం హైకోర్టు బార్ తీర్మానంతో పాటు సుప్రీం కోర్టు అనుమతి కూడా అవ‌స‌రం. దాని గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. హైకోర్టులో ఆ బిల్లును ఉప‌సంహరించుకుంటూ పిటిష‌న్ వేసిన ఏపీ స‌ర్కార్ మ‌ళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ఈసారి ఎన్నిక‌ల‌కు కూడా అదే ఎజెండాతో వెళ్లాల‌ని జ‌గ‌న్ ఫిక్స్ అయ్యార‌ని స‌మాచారం. ఎన్నిక‌ల లోపు హైకోర్టును క‌ర్నూలుకు మార్చే అంశాన్ని హైకోర్టు జ‌డ్జి దృష్టికి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. బ‌హుశా ఇవాళ జ‌రిగే భేటీలోని ప్ర‌ధాన అంశం కూడా ఇదే ఉంటుంద‌ని వినికిడి. మొత్తం మీద ఈనెల 30వ తేదీన దేశ వ్యాప్తంగా న్యాయ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న స‌మావేశానికి ముందుగా ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జ‌డ్జిస్ భేటీ కీల‌కంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ap chief justice
  • AP high court
  • Prashant kumar
  • YS Jagan Mohan Reddy

Related News

Ambati Rambabu

అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

Ambati Rambabu  వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి కుక్కకూ ఒక రోజొస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు తగ్గనే తగ్గను’ అని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అనం

  • Supreme Court Strong Warning To YCP MLC Anantha Babu

    అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

Latest News

  • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

  • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

  • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

Trending News

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd